టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల బాబీ దర్శకత్వంలో వచ్చిన జైలవకుశ సినిమాలో నటించి మంచి సక్సెస్ ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్న ఎన్టీఆర్, ఆ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో పాటు తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఇటీవల ఎన్టీఆర్ ప్రక్కన హీరోయిన్ గా హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ ని సినిమా యూనిట్ సెలెక్ట్ చేసింది. 

 

దాదాపుగా రూ.450 కోట్ల భారీ బడ్జెట్ తో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జులై 30న రిలీజ్ చేయనున్నారు. ఇకపోతే దీని తరువాత ఎన్టీఆర్, కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. ఇక నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, 

 

ఆ సినిమాలో ఎన్టీఆర్ ప్రక్కన హీరోయిన్ గా కెజిఎఫ్ భామ శ్రీనిధి శెట్టి ని తీసుకోవాలని దర్శకుడు ప్రశాంత్ నిర్ణయించినట్లు టాక్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో భరీగా తెరకెక్కనున్న ఈ సినిమా కథ ఇప్పటికే చాలా వరకు పూర్తి అయిందని, ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా మే నెలాఖరు నాటికి పూర్తి కానుండడంతో, ఏప్రిల్ లో తమ సినిమా ముహూర్తం కార్యక్రమం జరిపి, రెగ్యులర్ షూటింగ్ ని జూన్ లో మొదలెట్టాలని చూస్తున్నారట. కాగా నేడు విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు ఎంతరకు ఉన్నాయో తెలియదు గని, ఒకవేళ నిజమే అయితే మాత్రం, ఈ వార్త ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మంచి పండుగ వార్తే అని చెప్పక తప్పదు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: