‘ఖైదీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కార్తి ఇమేజ్ తెలుగు ప్రేక్షకులలో కూడ బాగా పెరిగిపోయింది మెగా స్టార్ చిరంజీవి టైటిల్స్ ను వరస పెట్టి కబ్జా చేస్తున్న కార్తి తన లేటెస్ట్ మూవీకి ‘దొంగ’ అన్న టైటిల్ ఫిక్స్ చేసి తన సక్సస్స్ ట్రాక్ ను కొనసాగించడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. మళయాళ మూవీ ‘దృశ్యం’ ఫేమ్ జీతూ జోసెఫ్ ఈ సినిమాను డైరెక్ట్ చేసాడు. 

నిజ జీవితంలో వదినా మరది అయిన జ్యోతిక కార్తిలు ఈ సినిమాలో అక్కా తమ్ముళ్ల పాత్రలో నటించడంతో ఈ మూవీ పై బాగా అంచనాలు ఉన్నాయి. తమిళంలో ‘తంబి’ టైటిల్‌ తో రూపొందించిన ఈ  సినిమాను తెలుగులో ‘దొంగ’ పేరుతో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. 

కార్తికి తెలుగు పై మంచి పాటు ఉండటంతో ఈ మూవీకి సంబంధించిన తెలుగు డబ్బింగ్ ను కూడ కార్తి తన సొంత గొంతుతో పూర్తి చేసాడు. ఇది ఇలా ఉండగా ఈ మూవీ ఆడియో ఫంక్షన్ ఈ రోజు భాగ్యనగరంలో జరగబోతోంది. ఈ వేడుకకు నాగార్జున ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నాడు. 

‘ఊపిరి’ సినిమాలో కార్తి నాగార్జునలు కలిసి నటించిన నాటి నుండి వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం కొనసాగుతోంది. ఈ సాన్నిహిత్యంతోనే కార్తి కోరగానే నాగార్జునమూవీ ఫంక్షన్ కు అతిథిగా రావడానికి అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. వయాకామ్‌ 18 స్టూడియోస్‌ ప్యారలల్‌ మైండ్స్‌ ప్రొడక్షన్‌ సంయుక్తంగా తీసిన ఈ మూవీకి అన్ని నిర్మాణ కార్యక్రమాలు పూర్తి కావడంతో ఈ మూవీని కూడ డిసెంబర్ రేస్ లో విడుదల చేస్తున్నట్లుతెలుస్తోంది. మెగా కుటుంబ హీరోలు టచ్ చేయడానికి భయపడుతున్న చిరంజీవి టైటిల్స్ ను కబ్జా చేస్తూ కార్తి తీస్తున్న పరుగులు చూసి మెగా అభిమానులు కుడా ఖంగారు పడుతూ కార్తి అత్యుత్సాహం చూసి షాక్ అవుతున్

మరింత సమాచారం తెలుసుకోండి: