మెగా కాంపౌండ్ కోడలు ఉపాసన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసినదే. ముఖ్యంగా తన భర్త రామ్ చరణ్ కి సంబంధించిన విషయాలను మరియు అదే విధంగా సమాజంలో ఎక్కువగా ప్రభావితం చేసే విషయాల గురించి ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను ముక్కుసూటిగా వ్యక్తంచేసే ఉపాసన గతంలో ప్రధాని మోడీ భారతీయ సినిమా చలనచిత్ర రంగానికి సంబంధించిన నటీనటులతో సమావేశం అని చెప్పి కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీ తారల తోనే సమావేశమైన సందర్భంలో సౌత్ ఇండస్ట్రీ అంటే భారతీయ చలన చిత్ర రంగంలో భాగం కాదా అంటూ ఎవరూ వెయ్యలేని ప్రశ్నలు సోషల్ మీడియా సాక్షిగా కేంద్ర ప్రభుత్వంపై ప్రశ్నించి పెద్ద హాట్ టాపిక్ అయింది ఉపాసన.

 

ఇటువంటి నేపథ్యంలో ఇటీవల యూట్యూబ్లో తనకంటూ ప్రత్యేకమైన ఛానల్ క్రియేట్ చేసుకున్న ఉపాసన ...సమాజంలో ఉన్న సామాన్య ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉపయోగపడే వీడియోలు ఆరోగ్యపరంగా మరియు ఉద్యోగ పరంగా అన్నిటికి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తూ అందరి మన్నలను పొందుతుంది. ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఉపాసన తన యూట్యూబ్ ఛానల్ లో  మరొక వీడియోని విడుదల చేసింది. డీటెయిల్ గా విషయం లోకి వెళ్తే తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పిల్లలందరిని దుర్మార్గమైన కామాంధుల భారిన పడకుండా కాపాడటం ఎలా అనే ఒక అంశం పై ఒక వీడియో ని చేసి, తన ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలందరి కోసమని విడుదల చేసింది.

 

కాగా ఈ వీడియో లో పిల్లలపై జరుగుతున్న అత్యాచారాల నుంచి ఎలా కాపాడుకోవాలి అనే అంశంపై సమగ్ర సమాచారాన్ని పొందుపరిచే విధంగా వీడియో విడుదల చేయడం జరిగింది. దీంతో ప్రస్తుతం సమాజంలో ఉన్న కొంతమంది మగవాళ్లు మృగాల్లా గా ప్రవర్తిస్తున్న తరుణంలో ఉపాసన విడుదల చేసిన వీడియోలకు నెటిజన్లు జై కొడుతున్నారు. మరిన్ని వీడియోలు సమాజానికి ఉపయోగపడే విధంగా ఉపాసన విడుదల చేయాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: