విజయశాంతి పేరుకు తగినట్లుగా విజయాలను సొంతం చేసుకుంది. ఆమె 1980లో కిలాడి క్రిష్ణుడు మూవీ ద్వారా వెండి తెరకు ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ మూవీయే సూపర్ స్టార్ క్రిష్ణతో హీరోయిన్ గా చాన్స్ కొట్టేసింది. ఆ మూవీని ది గ్రేట్ లేడీ డైరెక్టర్ విజయనిర్మల డైరెక్ట్ చేశారు. ఆ విధంగా విజయశాంతి లక్కీ అని చెప్పాలి. టాప్ స్టార్ తో మూవీ తరువాత ఆమెకు వెంటనే ఆమె అప్పటి  యువ హీరోలతో నటించేందుకు పెద్ద చాయిస్ అయింది. 

 

అప్పట్లో చిరంజీవి కొత్తగా సినిమాలోకి రావడం, బాలక్రిష్ణ కూడా ఎన్టీయార్ వారసుడిగా  ఎంట్రీ ఇవ్వడంతో వారిద్దరి చిత్రాలో ఎక్కువగా విజయశాంతి నటించి సూపర్ స్టార్ డం సొంతం చేసుకుంది. ఇక బాలయ్య కెరీర్లో ఆయనతో నటించిన హీరోయిన్లలో ఎక్కువ చిత్రాల్లో  నటించింది విజయశాంతి. ఈ ఇద్దరి కాంబోలో హిట్లు, బ్లాక్ బస్టర్లు కూడా ఉన్నాయి.

 

ఇక విజయశాంతి 1990 తరువాత లేడీ ఓరియెంటెడ్ మూవీస్ ఎక్కువగా చేయడంతో ఆమె హీరోలతో సమానంగా ఇమేజ్ ని సొంతం చేసుకుంది. ఒక దశలో లేడీ అమితాబ్ గా ఆమె కీర్తి శిఖరాలకు చేరింది. ఇక విజయశాంతితో అపుడు హీరోలు బాలక్రిష్ణ, చిరంజీవి వేరే కొత్త వారిని చూసుకోవాల్సి వచ్చింది. 

 

ఇవన్నీ ఇలా ఉంటే విజయశాంతి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఆమె సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు మూవీలో ఓ కీలకపాత్ర పోషిస్తోంది. ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ మూవీ తరువాత మంచి పాత్రలు ఉంటే తప్పకుండా నటిస్తాను అని విజయశాంతి చెబుతోంది. దాంతో ఆమెను బోయపాటి శ్రీని అప్రోచ్ అయ్యారని టాక్ నడుస్తోంది.

 

బాలయ్య, బోయపాటి హ్యాట్రిక్ మూవీలో ఓ పవర్ ఫుల్ లేడీ విలన్ పాత్రను డిజైన్ చేశారట. దానికి మొదట రోజాను అనుకున్న అమె నో చెప్పడంతో ఇపుడు విజయశాంతి బెస్ట్ ఆప్షన్ అని  అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. విజయశాంతి కనుక ఒప్పుకుంటే మళ్ళీ బాలయ్యతో పాతికేళ్ళ తరువాత నటించినట్లు అవుతుంది.ఈ ఇద్దరు కలసి చేసిన చివరి సినిమా నిప్పురవ్వ 1993లో రిలీజ్ అయింది. ఓ విధంగా ఇది క్రేజీ కాంబో కూడా అవుతుంది. బాలయ్య ఫ్యాన్స్ కి కూడా పండుగలా ఉంటుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: