టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన అంతకముందు ఆ తరువాత అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈష రెబ్బ, తొలి సినిమాతోనే మంచి పేరు సంపాదించింది. ఆ సినిమా పెద్దగా సక్సెస్ కానప్పటికీ నటిగా ఈషా మాత్రం మన తెలుగు వారికీ కొంత చేరువయింది. తెలంగాణలోని వరంగల్ ప్రాంతానికి చెందిన ఈషాకు మొదటి నుండి సినిమాల పై మంచి ఇంటరెస్ట్ ఉండడంతో మోడలింగ్ అనంతరం ఆమె సినిమాల్లోకి ప్రవేశించారు. ఇక ఆ తరువాత మరొక్కసారి ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన బందిపోటు, అమీ తుమీ సినిమాల్లో కూడా ఆమె హీరోయిన్ గా నటించి మంచి పేరు సంపాదించారు. 

 

అనంతరం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన అరవింద సమేతలో హీరోయిన్ చెల్లెలి పాత్రలో నటించి మెప్పించిన ఈషా, ఇటీవల శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో వచ్చిన రాగాల 24 గంటల్లో అనే మూవీలో హీరోయిన్ గా నటించింది. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం బాగానే కలెక్షన్లు సంపాదిస్తోంది. ఇక ఈ సినిమాలో ఈషా రెబ్బ విపరీతంగా అందాలు అరబోయడంతో ఆమె ఫ్యాన్స్ కొంత షాక్ అయ్యారు అనే చెప్పాలి. ఇప్పటివరకు కొంత జాగ్రత్తగా నటించిన ఈషా, ఒక్కసారిగా ఇంత హాట్ గా కనపడడం కొంతవరకు ఈ సినిమాకు కలిసి వచ్చిందని అంటున్నారు సినీ విశ్లేషకులు. 

 

అయితే ఆమె ఈ విధంగా అందాలు ఆరబోసింది, మెగాస్టార్ సరసన రూపొందబోయే 152వ సినిమా కోసమే అని అంటూ కొందరు పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం మెగాస్టార్ మూవీలో ఈషా ఒక హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిందని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పటివరకు ఈ వార్తలపై ఆ సినిమా యూనిట్ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు......!! 

మరింత సమాచారం తెలుసుకోండి: