తెలుగు తెరపై ఈ మద్య తెలుగు అమ్మాయిల జోరు కొనసాగుతుంది. స్వాతి, శ్రీ దివ్య, ఆనంది.. వీరందరు తెలుగు హీరొయిన్ లు. తమిళంలో సక్సెస్పుల్ కధానాయికలుగా వెలుగొందినవారు. ఇప్పటి వరకు ఇతర భాషా హీరోయిన్లు మాత్రమే టాలీవుడ్ లో ఎక్కువగా తమ అందాల ఆరబోతతో ఫామ్ లో కొనసాగుతున్నారు. ఇటీవల కాలంలో తెలుగు హీరోయిన్లు కూడా తమ సత్తా చాటుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ స్త్రీ రేపు రా, నేను లోకల్, ఫ్యాషన్ డిజైనర్, హౌరా బ్రిడ్జ్, ఎంఎల్ఏ’’ వంటి సినిమాల ద్వారా సిల్వర్ స్ర్కీన్పై మెరిసిన పక్కా హైదరాబాదీ అమ్మాయి మనాలీ రాథోడ్.
తెలుగులోనే కాదు ప్రస్తుతం తమిళ తెరపై కూడా ఈ తెలుగు బ్యూటీ తన సత్తా చాటుతుంది. వరలక్ష్మి శరత్ కుమార్ పూనమ్ బజ్వా ,ఆత్మిక ప్రధాన పాత్రల్లొ డికె దర్శకత్వంలో జ్ఞానవేల్ రాజా నిర్మిస్తొన్న “కాతెరి” మూవీలో మనాలీ లీడ్ రోల్ లో నటించింది. ఓ వైపు హీరోయిన్ గా నటిస్తూ మరోవైపు సపోర్టింగ్ క్యారెక్టర్స్ తో మనాలీ తన కెరీర్ కొనసాగిస్తూ వస్తుంది.
తమిళ సినిమాలంటే స్వతహాగా ఇష్టపడే తనకు విజయ్ సేతుపతి, శివకార్తీకేయనల సినిమాలను అభిమానిస్తానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మనాలీ రాథోడ్ చెప్పింది. ఈ అమ్మడు తాజాగా విజ్జిత్ని వివాహం చేసుకుంది. వీరి వివాహానికి పలువురు సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. హేమ, సురేష్ కొండేటి తదితరులు నూతన దంపతులకి ఆశీర్వాదం అందించారు. ఇప్పటి వరకు తన కెరియర్ని సపోర్టింగ్ రోల్స్తో స్టార్స్ చేయగా, ప్రస్తుతం హీరోయిన్గా నటిస్తుంది.
నేషనల్ అవార్డ్ విన్నర్ వంశీ తెరకెక్కించిన ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్ మూవీతో అందరి దృష్టిని ఆకర్షించింది. చివరిగా ఎంఎల్ఏ అనే మూవీలో నటించిన ఈ అమ్మడు తన తదుపరి సినిమా విషయాలు ఇప్పటి వరకు వెల్లడించలేదు.