టాలీవుడ్ సినిమా పరిశ్రమకు కెరటం సినిమాతో అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ దాని తరువాత సందీప్ కిషన్ హీరోగా మేర్లపాక గాంధీ తెరకెక్కించిన వెంకకటాద్రి ఎక్స్ ప్రెస్ తో మంచి సక్సెస్ ని అందుకుంది. అయితే ఆ తరువాత ఆమె పెద్దగా సక్సెస్ లు అందుకోనప్పటికీ, అనంతరం గోపీచంద్ సరసన లౌక్యం మంచి హిట్ సాధించడంతో టాలీవుడ్ లో రకుల్ కు మెల్లగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఇక ఆ తరువాత రామ్ సరసన ఆమె నటించిన పండగ చేసుకో, అలానే ఎన్టీఆర్ సరసన ఆమె నటించిన నాన్నకు ప్రేమతో సినిమాలు కూడా మంచి సక్సెస్ సాధించడంతో టాలీవుడ్ లో రకుల్

 

మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తరువాత ఆమెకు వరుసగా స్టార్ హీరోల సరసన మంచి ఛాన్స్ లు లభించినప్పటికీ వాటిలో ఎక్కువ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. తెలుగుతో పాటు తమిళ్ మరియు హిందీలో కూడా అవకాశాలు అందిపుచ్చుకున్న రకుల్ కు అక్కడ కూడా పెద్దగా సక్సెస్ లు దక్కలేదు. ఇక ప్రస్తుతం శంకర్ మరియు కమల్ హాసన్ ల కలయికలో తెరకెక్కుతున్న భారతీయుడు 2 తో పాటు, శివ కార్తికేయన్ సరసన మరొక సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రకుల్ కు ప్రస్తుతం తెలుగులో ఒక్క అవకాశం కూడా లేదు. 

 

అయితే నిన్న ఒక మీడియా ఇంటర్వూలో ఆమె మాట్లాడుతూ, తాను నిన్ననే రెండు తెలుగు సినిమాలకు సైన్ చేయడం జరిగిందని, అయితే ఆ సినిమాల వివరాలు అతి త్వరలో తెలియపరచడం జరుగుతుందని ఆమె చెప్పారు. ఇక మొన్నటి వరకు తమ హీరోయిన్ కు తెలుగులో అవకాశాలు లేకపోవడంతో కొంత ఢీలా పడ్డ రకుల్ ఫ్యాన్స్, సడన్ గా ఆమెకు రెండు ఆఫర్లు రావడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆనందంతో కామెంట్స్ చేస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: