మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి సోషల్ మీడియా లో ఎంతలా యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిత్యం ప్రజలకి, ఉద్యోగులకు, అందరికి సంబంధించి, వారికి ఉపయోగపడే వీడియోలు చేస్తూ అందరి మన్ననలను పొందుతుంది. కాగా తాజాగా ఉపాసన మరొక వీడియోని విడుదల చేసింది. తాజాగా ఉపాసన తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పిల్లలందరిని దుర్మార్గమైన కామాంధుల భారిన పడకుండా కాపాడటం ఎలా అనే ఒక అంశం పై ఒక వీడియో ని చేసి, తన ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలందరి కోసమని విడుదల చేసింది.
ఈ వీడియో లో పిల్లలపై జరుగుతున్న అత్యాచారాల నుంచి ఎలా కాపాడుకోవాలి అనే అంశంపై సమగ్ర సమాచారాన్ని పొందుపరిచింది ఆమె. ఇకపోతే దేశంలో ప్రస్తుతానికి మహిళలు, బాలికలపై లైంగిక పరమైన క్రూరమైన దాడులు ఎక్కువగా జరుగుతున్న తరుణంలో మెగా కోడలు ఉపాసన తీసుకున్న ఈ చొరవకు అభిమానులు అందరు కూడా సలాం కొడుతున్నారు.
అంతేకాక తాజాగా తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా ప్రబలుతున్న డెంగ్యూ జ్వరాల బారిన పడకుండా పాటించాల్సిన చిట్కాలను ఆమె వీడియో రూపంలో యూట్యూబ్ లో విడుదల చేసింది. అయితే గతంలో సైతం ఆమె ఫిట్ నెస్ కు సంబంధించిన పలు వీడియోలను విడుదల చేయడం ద్వారా ఆమె ప్రత్యేకంగా తనకంటూ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తాజాగా సంక్రమిత వ్యాధుల గురించి ప్రజల్లో అవగాహన పెంచేలా ఉపాసన చేస్తున్న కృషికి అన్ని వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోలను చేసి ప్రజంట్ ఇష్యూస్ పై ప్రజలకు ఒక అవగాహన కల్పించడం అనేది చాలా మంచి పని. కొందరు సెలబ్రెటీలు కేవలం వాళ్ళ బిజీ లో వాళ్ళు ఉండడమే కాకుండా ఇలాంటి సోషల్ ఎవేర్నెస్ పనులు చేయడం వల్ల వాళ్ళకు ప్రజల ద్వారా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.