ప్రస్తుతం 'వి' సినిమా షూటింగ్‌ లో బిజీగా ఉన్న నేచురల్‌ స్టార్‌ నాని తన తదుపరి చేయబోయే సినిమాను కూడా లైన్‌ లో పెట్టాడు. గతంలో నాని హీరోగా "నిను కోరి" సినిమాను తెరకెక్కించిన శివా నిర్వాణ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేస్తున్నాడు నేచురల్‌ స్టార్‌ నాని. ఇప్పటికే కథా చర్చలు కూడా పూర్తయిన ఈ సినిమా డిసెంబర్‌ లో సెట్స్‌ మీదకు ఈ సినిమా వెళ్లనుంది.

 

 

షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాలో నానికి జోడిగా రీతూ వర్మ నటించనుంది. నాని కెరీర్‌ ను ములపు తిప్పిన "ఎవడే సుబ్రమణ్యం" సినిమాతో నాని, రీతూలు వీరిద్దరూ కలిసి నటించారు. ఇప్పుడు మరోసారి వీరిద్దరు జోడి కడుతుండటం ఆసక్తికరంగా మారింది ఇండస్ట్రీలో.

 

 

నాగ చైతన్య, సమంత హీరో హీరోయిన్లుగా మ‌జిలీ లాంటి సూప‌ర్‌హిట్ త‌ర్వాత శివ నిర్వాణ ద‌ర్శక‌త్వంలో ఈ సినిమా తాయారు కాబోతుంది. డిసెంబ‌ర్ నెల‌లో ఈ సినిమా లాంఛ‌నంగా ప్రారంభించి జ‌న‌వ‌రిలో రెగ్యుల‌ర్ షూటింగ్‌ కు వెళ్లేందుకు ప్లాన్‌ చేస్తున్నారు చిత్ర యూనిట్‌ సభ్యులు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు చిత్ర యూనిట్‌ సభ్యులు.

 

 

ప్రస్తుతం నాని ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `వి` సినిమాలో చేస్తున్నాడు. సుధీర్‌ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో తొలిసారిగా నాని ప్రతినాయక పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ సినిమా తరువాత శివ నిర్మాణ సినిమా పనులు మొదలు పెట్టనున్నాడు.

 

 

జూనియర్ ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కిన బాద్‌ షా సినిమాతో టాలీవుడ్‌ కు పరిచయం అయిన రీతూవర్మ ఎవడే సుబ్రమణ్యం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత పెళ్లి చూపులు సినిమాతో సూపర్‌ హిట్ అందుకొని హీరోయిన్‌గా సెటిల్‌ అయ్యింది. పెళ్లి చూపులు తర్వాత తెలుగులో ఒక్కే కేశవ సినిమా మాత్రమే చేసిన ఈ భామ మూడేళ్ల తర్వాత తిరిగి తెలుగు సినిమాకు అంగీకరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: