పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న పవన్ రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రజా సమస్యల విషయంలో అధికార పార్టీలను ప్రశ్నిస్తూ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తనదైన శైలిలో రాజకీయాలు చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయినా గాని ఎక్కడా కూడా వెనుకడుగు వేయకుండా ప్రజా సమస్యల కోసం పోరాడుతున్న పవన్ కళ్యాణ్ త్వరలో ఓ కుర్రహీరో ఆడియో వేడుకకు చీఫ్ గెస్ట్ గా వస్తున్నట్లు ఫిలింనగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. మొన్న మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా' ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన పవన్ కళ్యాణ్… తరువాత 'జార్జి రెడ్డి' ప్రీ రిలీజ్ వేడుకకు రావలసి ఉండగా చివరి క్షణంలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోవడం జరిగింది.

 

ఇటువంటి నేపథ్యంలో తాజాగా హీరో నితిన్ నటించిన భీష్మ సినిమా ప్రి రిలీజ్ వేడుకకు చీఫ్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్ రాబోతున్నట్లు సమాచారం. గతంలో నితిన్ నటించిన పలు సినిమాల ప్రారంభోత్సవ మరియు ఆడియో ఫంక్షన్ కార్యక్రమాలకు పవన్ హాజరైన విషయం తెలిసిందే. అలానే ఈ సినిమా ఫంక్షన్ కు కూడా తన అభిమాన హీరోని ఆహ్వానించాలని నితిన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కొంత బిజీ షెడ్యూల్స్ తో గడుపుతున్నారని, కావున ఆయన భీష్మ సినిమా ఫంక్షన్ కు ఎంతవరకు వస్తారు అనేది కొంత అనుమానమే అని కూడా అంటున్నారు.

 

నితిన్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా గతంలో వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న తన అభిమాని నితిన్ నటించిన ఇష్క్ సినిమా వేడుకకు చీఫ్ గెస్ట్ గా హాజరు కావడంతో ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో… భీష్మ సినిమా వేడుకకు ఎలాగైనా తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ ని తీసుకురావాలని హీరో నితిన్ పట్టు పడుతున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: