ప్రస్తుతం ఈటివి ఛానల్ లో ప్రసారం అవుతున్న క్రేజీ షోల్లో ఒకటైన జబర్దస్త్ షో పై మెగాబ్రదర్ నాగబాబు నేడు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వీడియో ని పోస్ట్ చేసి ఒక పెద్ద సంచలనానికి తెర లేపారు. నిజానికి తనకు సమస్యల్లో ఉన్నప్పుడు జబర్దస్త్ నుండి ఆహ్వానం రావడం జరిగిందని, అయితే దేవుడి దయ మరియు ప్రేక్షకుల ఆదరణ వలన ఆ షో బాగా దినదినాభివృద్ధి చెందుతూ నేడు ఎంతో పాపులర్ షోగా ఎదిగిందని, తద్వారా తనకు ఆర్ధికంగా కూడా కొన్ని సమస్యలు తీరాయని అన్నారు. అయితే అందరూ భావిస్తున్నట్లు గా నిజానికి తాను జబర్దస్త్ షో నుండి మాములుగా బ్రేక్ తీసుకోవడం కోసం బయటకు రాలేదని, 

 

ఆ షో నిర్వాహకుల్లో కొందరి ప్రవర్తన తనకు నచ్చకపోవడం వల్లనే షో నుండి బయటకు వచ్చినట్లు చెప్పారు నాగబాబు. తనకు రోజా గారితో మరియు షోలో ని అందరు పార్టిసిపెంట్స్ తో పాటు షో నిర్వాహక సభ్యులతో కూడా మంచి అనుబంధం ఉందని, అయితే కొన్ని సందర్భాల్లో షో పార్టిసిపెంట్స్ లో ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే షో నిర్వాహక సభ్యుల్లో కొందరు మాత్రం ఏమి తెలియనట్లు, మాకెందుకులే అన్నట్లుగా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం పలుమార్లు జరిగిందని, అటువంటివి తనను ఎంతో కలిచి వేశాయని అన్నారు. వేణు వండర్స్ స్కిట్స్ చేసే వేణుకు ఒకానొక సమయంలో కొంత ఆరోగ్య సమస్య వచ్చిందని, 

 

ఆ తరువాత మరికొందరు జబర్దస్త్ నటులు కూడా ప్రమాదాలు మరియు గాయాల బారిన పడినప్పటికీ, షో నిర్వాహకుల్లో ఎటువంటి చలనం లేదని అన్నారు. ఏదో అందరూ మా షోలో పని చేస్తున్నారు, వారికి ఇవ్వాల్సింది ఇస్తున్నాం అంతవరకే, అంతకుమించి మిగతావి మాకు సంబంధం లేదు అనే విధంగా వ్యవహరించడం సరైనది కాదని అన్నారు. నిజానికి ఈ షో ను నిర్వహిస్తున్న మల్లెమాల సంస్థ అధినేత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఎంతో మంచివారని, అయితే అందులోని కొందరి వల్ల మొత్తం షో కే ప్రస్తుతం నష్టం చేకూరే పరిస్థితులు వస్తున్నాయని నాగబాబు స్పష్టం చేసారు. కాగా ఈ వీడియో ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: