యువరత్న నందమూరి బాలకృష్ణ కెరీర్లో 105వ సినిమా తెరకెక్కుతున్న రూలర్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. కోలీవుడ్ దర్శకుడు కేఎస్. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలయ్య - కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్ లో వచ్చిన జై సింహా సినిమా సూపర్ హిట్ అవడంతో ఇప్పుడు రూలర్ సినిమాపై సైతం మంచి అంచనాలే ఉన్నాయి.
ఇక ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ఓ రేంజులో ఉన్నాయని తెలుస్తోంది. తెలుగులో బాలయ్య సినిమాలతో పోలిస్తే మిగతా హీరోల సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ అంత హైలైట్ కావు. బాలయ్య సినిమాలో యాక్షన్ సీన్లు, బాలయ్య డైలాగులు ప్రేక్షకులకు ఓ రేంజ్లో పూనకాలు తెప్పిస్తాయి. ఇక ఇప్పుడు రూలర్ సినిమాలోనూ యాక్షన్ ఎపిసోడ్స్ కు కొదవ లేదని తెలుస్తోంది. ఈ ఏడాది బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్లు కథానాయకుడు, మహానాయకుడు సినిమాల్లో బాలయ్య అలాంటి ఎపిసోడ్స్ చేయలేకపోయారు. ఇక ఇప్పుడు రూలర్ సినిమాలో ఏకంగా ఐదు యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ ఫైట్లు సినిమాకే హైలెట్ అంటున్నారు. ఇక గతంలో బాలయ్య - కేఎస్.రవికుమార్ కాంబోలో వచ్చిన జై సింహా సినిమాలో ఉన్న యాక్షన్ను మించి ఈ సినిమాలో యాక్షన్ ఉంటుందట. ఇక ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ సీన్ సినిమాకే హైలెట్ అంటున్నారు. బీహార్ నేపథ్యంలో డిజైన్ చేసిన ఫైట్, మార్కెట్ నేపథ్యంలో మరో ఫైట్, ట్రైన్లో ఇంకో భారీ ఫైట్ అభిమానులని అలరిస్తాయట. ఈ సీన్లు అన్ని ఫ్యాన్స్కు పూనకాలు తెప్పిస్తాయంటున్నారు.
ఇక జై సింహా సినిమాలో మాదిరిగా సెకండాఫ్లో బాగా సెంటిమెంట్ను దట్టిం చేశారట. అంటే అటు యాక్షన్, ఇటు సెంటిమెంట్ రెండు కలగలిసి రూలర్ బాగా వచ్చిందంటున్నారు. మరి రూలర్గా బాలయ్య బాక్సాఫీస్ దగ్గర ఎలా ? గర్జిస్తాడో ? డిసెంబర్ 20న తేలిపోనుంది.