హైదరాబాదులో జరిగిన ప్రియాంక రెడ్డి అత్యాచారం ఘటన యావత్ దేశంతో పాటు ప్రపంచ దేశాలను కలచివేస్తోంది. దేశంలో ఉన్న చాలా మంది సెలబ్రిటీలు మరియు నెటిజన్లు సోషల్ మీడియాలో అత్యాచారానికి పాల్పడిన నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో చాలామంది టాలీవుడ్ ఇండస్ట్రీ సెలబ్రిటీలు అదేవిధంగా బాలీవుడ్ ఇండస్ట్రీ హీరో హీరోయిన్లు వీడియోల రూపంలో ప్రియాంక రెడ్డి అత్యాచారం ఘటనపై స్పందించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నలుగురు కామాంధులు ప్రియాంక రెడ్డి మృతి చెందాక కూడా శవం పైన అనేక వికృత చేష్టలు పాల్పడినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడించింది.

 

దీంతో ఈ విషయం బయటకు రావడంతో ఆమె కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు కూడా షాక్ తిని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రియాంక రెడ్డి పై 30 నుండి 45 నిమిషాలపాటు అత్యాచారం చేసి చంపేసిన కామాందుడు ఆమె మృతదేహాన్ని లారీ క్యాబిన్లో ఎక్కించి బట్టల్లేని ఆ మృతదేహంపై తమ శరీర కోరికలు మనిషి రూపంలో ఉన్న ఆ నలుగురు మృగాలు తీర్చుకున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ఈనేపథ్యంలో ఘటనా స్థలంలో పోలీసులు మృతురాలు ప్రియాంక రెడ్డి లోదుస్తులు, పర్సు, చెప్పులు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.

 

మరోవైపు నిందితుల్లో ఓ మైనర్ ఉన్నట్లు ముందుగా ప్రచారం జరిగినా.. అందరూ 20ఏళ్లకు పైబడిన వారేనని పోలీసులు స్పష్టం చేయడంతో ఆ ప్రచారానికి తెరపడింది. ఘటన జరగక ముందు ఆమెకు పూర్తిగా మద్యం తాగించి దుండగులు అత్యాచారానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో విచారణలో బయట పడిన విషయాలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆ నలుగురు మృగాలకి బహిరంగంగా శిక్ష పడేలా న్యాయస్థానాలు శిక్ష విధించాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దోషులకు శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: