ఇటీవల స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 3 షోలో విజేతగా రాహుల్ సిప్లిగంజ్ నిలవగా, రన్న రప్ గా  యాంకర్ శ్రీముఖి నిలిచింది. నిజానికి ఈ షో నుంచి రాహుల్, శ్రీముఖి ఒకరికొకరు ఎంతో పోటాపోటీగా ఆడుతూ వచ్చారు. ఇక చివరికి ఇద్దరు కూడా ఫైనల్ లిస్టుకు చేరడంతో, కొందరు రాహుల్ గెలుస్తాడని భావిస్తే, మరికొందరు మాత్రం శ్రీముఖి గెలుస్తుందని భావించారు. కాగా ఫైనల్ జరిగే రోజున అందరికంటే అత్యధికంగా మార్కులు మరియు ప్రేక్షకుల ఓటింగ్స్ సంపాదించి రాహుల్ విన్నర్ గా నిలిచాడు. 

 

ఇక షో మధ్యలో రాహుల్ కు మరియు శ్రీముఖికి మధ్య కొద్దిపాటి గొడవలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ గొడవలు శ్రీముఖి ఇప్పటికీ మరిచిపోలేదు అనడానికి నిన్న జరిగిన ఒక ఘటనే ఉదాహరణ అని చెప్పవచ్చు. ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే, నిన్న రాహుల్ సిప్లిగంజ్ తన ఫ్యాన్స్ కోసం ఒక లైవ్ కన్సర్ట్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం జరిగింది. 

 

ఇక ఈ వేడుకకు వరుణ్ సందేశ్, పునర్నవి, ఆలీ రాజా సహా మరికొందరు బిగ్ బాస్ నటులు హాజరయ్యారు కాగా, ఈ వేడుకలో శ్రీముఖి మాత్రం కనపడలేదు. వాస్తవానికి ఇటీవల తన కన్సర్ట్ విషయమై శ్రీముఖికి కాల్ చేశానని, అయితే ఆమె ఒక ఫోటో షూట్ లో బిజీగా ఉందని తెలిసి మరొకసారి ప్రయత్నించి కాల్ చేసి తన కన్సర్ట్ కి ఆహ్వానించా అని చెప్పాడు రాహుల్. కానీ చివరికి శ్రీముఖి మాత్రం కన్సర్ట్ కి రాకుండా హ్యాండ్ ఇవ్వడం చూస్తుంటే, రాహుల్ కి శ్రీముఖి ఊహించని పెద్ద షాకే ఇచ్చిందని చెప్పాలి. కాగా ఈ మ్యాటర్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతుంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: