టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కి అ..ఆ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ సినిమా ఒక్కటి పడలేదు. ఎన్నో భారీ అంచనాలు పెట్టుకున్న లై, ఛల్ మోహన రంగా భారీ డిజాస్టర్స్ గా మిగిలాయి. దాంతో నితిన్ డైలమాలో పడ్డాడు. ఈ సారి కొడితే బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసి తో వేయిట్ చేసి వరుసగా సినిమాలని కమిటయ్యాడు. ప్రస్తుతం భీష్మ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నితిన్ కి జంటగా కన్నడ బ్యూటి రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాతో పాటు రంగ్ దే అనే సినిమా కూడా చేస్తున్నాడు. మహానటి కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే నితిన్ కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది.

 

 కొన్ని రీమేక్ సినిమాల రైట్స్ ఎంతో ఇష్టపడి కొనుక్కుంటారు మన టాలీవుడ్ హీరోలు. అయితే నితిన్ కూడా ఈ మధ్య బాలీవుడ్ సినిమా 'అంధదూన్' రీమేక్ రైట్స్ ను అదే విధంగా మిగతా వాళ్ళతో పోటీ పడి మరీ దక్కించుకున్నాడు. అయుష్మాన్ ఖురాన్ నటించిన 'అంధదూన్' సినిమా బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రిలీజైన వారానికే సినిమా కలెక్షన్స్ తో బాక్సాఫీస్ ని బద్దలు కొట్టి రికార్డ్ స్థాయిలో కలెక్ట్ చేసింది. ఇక రీసెంట్‌గా ఈ సినిమాకు హీరో ఆయుష్మాన్ కి నేషనల్ అవార్డు కూడా అనౌన్స్ చేయడం విశేషం.

 

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ రీమేక్ నుండి హీరోగా నితిన్ డ్రాప్ అయ్యాడట. నితిన్ ఓ యంగ్ హీరోతో ఈ సినిమాను నిర్మించే ఆలోచనలో ఉన్నాడట. ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు కానీ 'అంధదూన్' హీరోగా నితిన్ మాత్రం డ్రాప్ అనే టాక్ గట్టిగానే వినబడుతుంది. ఇక ఎంతో పోటీ మధ్య రీమేక్ రైట్స్ దక్కించుకొని తను చేయకుండా నితిన్ మరో హీరో చేతిలో సినిమాను పెడతాడని కూడా నమ్మలేం. ఇక ఈ రీమక్ గురించి నితిన్ నుండి ప్రకటన వచ్చే వరకూ క్లారిటీ వస్తుంది. అయితే నితిన్ ఈ సినిమాలో బ్లైండ్ గా నటించలేకనే డ్రాపయ్యాడని చెప్పుకుంటున్నాడు. అలాంటి పాత్రలో ప్రేక్షకులు నితిన్ ని ఊహించుకోలేరని భావించి నితిన్ డ్రాపైనట్టుగా సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: