బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న "అల వైకుంఠపురములో" చిత్రంపై అంచనాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. బన్నీ నుండి చాలా రోజుల తర్వాత వస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. అయితే ఆ అంచనాలకి తగ్గట్టుగానే సినిమా ప్రమోషన్స్ కూడా ఒక రేంజ్ లో ఉన్నాయి. మొదటి పాటతోనే సినిమా ప్రచారాన్ని శిఖరాగ్రానికి తీసుకెళ్ళిన థమన్, రెండో పాట అయిన రాములో రాములాతో మరో మెట్టు ఎక్కించాడు.

 

 

సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న ఈ చిత్రానికి ప్రమోషన్స్ చాలా అవసరం. ఎందుకంటే సంక్రాంతికి తెలుగులో చాలా సినిమాలు విడుదల అవుతున్నాయి. ఆ సినిమాలన్నింటిలోకి జనాలని ఆకర్షించాలంటే ప్రమోషన్స్ తప్పనిసరి. అయితే పాటల ద్వారా మొదలైన ప్రచారం పోస్టర్లతోనూ జనాలని ఆకర్షిస్తుంది. ఇప్పటికే సినిమాలోని నటీనటుల పోస్టర్లు బయటకి వచ్చాయి. అటు సీనియర్ నటి టబు లుక్ వచ్చేసింది.

 

 

అలాగే టాలీవుడ్ నటుడు సుశాంత్ కూడా ఈ సినిమాలో ఉన్నాడు. అతని లుక్ కూడా రిలీజ్ చేసించి చిత్ర బృందం. అయితే తాజాగా ఈ సినిమా నుండి మరో అప్డేట్ బయటకి వచ్చింది. మెంటల్ మదిలో సినిమాలో హీరోయిన్ గా నటించి, తన నటనతో అందర్నీ ఆకట్టుకున్న నివేధా పేతురాజ్ కూడా ఈ సినిమాలో నటిస్తుంది. ఈ రోజు ఆమె పుట్టినరోజు కారణంగా "అల వైకుంఠపురములో" ఆమె లుక్ ని విడుదల చేసింది.

 

 

పోస్టర్ లో ఆమె సాదాసీదాగా ఉంది. ఇప్పటి వరకు నివేధా పేతురాజ్ సినిమాలో ఉందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈ రోజు రిలీజ్ చేసిన పోస్టర్ తో ఈమె కూడా ఉందా అని ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. మరి ఈ సినిమాలో మనకి తెలియని వాళ్ళు ఇంకెంత మంది ఉన్నారో...

మరింత సమాచారం తెలుసుకోండి: