మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ నుండి బయటకు రావడం ఓ సెన్సేషన్ అని చెప్పొచ్చు. ఐదారేళ్లుగా తన ఆర్ధిక స్థిరత్వానికి జబర్దస్త్ బాగా ఉపయోగపడ్డదన్న నాగబాబు ఆ షో నుండి బయటకు వచ్చాక మాత్రం ప్లే మార్చేశాడు. జబర్దస్త్ నుండి ఎగ్జిట్ అయ్యాక మొదటి ఎపిసోడ్ కేవలం కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆగిపోవాల్సి వచ్చిందన్న నాగబాబు తను బయటకు రాడానికి చాలా కారణాలు ఉన్నాయన్న విషయం తను చేస్తున్న వీడియోస్ ను బట్టి అర్ధమవుతుంది.

 

లేటెస్ట్ గా నాగబాబు మరో వీడియో రిలీజ్ చేశాడు. జబర్దస్త్ షోలో స్కిట్స్ వేసే కమెడియన్స్ తమ ప్రాణం పెట్టి చేస్తున్నారని.. అయితే వాళ్లకు ఏదైనా సమస్య వస్తే మాత్రం ఈటివి కాని.. మల్లెమాల శ్యాం ప్రసాద్ రెడ్డి గాని ఎలాంటి సహాయం చేయట్లేదని అన్నారు. అయితే ఈ విషయంలో మల్లెమాల వారిని, ఈటివి వారిని గట్టిగా అడగాల్సిన అవసరం కూడా లేదని అన్నారు నాగబాబు.  

 

వేణు టీం లీడర్ గా ఉన్న టైంలో అతను చేసిన ఓ స్కిట్ వల్ల కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయని అతన్ని ఫిల్మ్ చాంబర్ దగ్గర చితకబాదారు. అయితే ఆ విషయంలో కూడా ఈటివి వారు కాని.. మల్లెమాల టీం కాని స్పందించలేదు. ఇక పంచ్ ప్రసాద్ కు కిడ్నీ ట్రాన్స్ ఫర్మేషన్ కోసం తామంతా కలిసి కొంత కొత్తం తయారు చేసుకున్నామని కాని మల్లెమాల తరపున ఎలాంటి హెల్ప్ అందలేదని అన్నారు నాగబాబు.

 

బయటకు వచ్చాక ఈ విషయాలను చెప్పి షాక్ ఇస్తున్నారు నాగబాబు. అయితే ఇవన్ని చెబుతూనే వారికి ఇవ్వాల్సిన అవసరం లేదు కాదు అంటూనే వాయించేస్తున్నారు మెగా బ్రదర్ నాగబాబు. సో మొత్తానికి ఆయన మల్లెమాల శ్యాం ప్రసాద్ రెడ్డి మీద కోపంతోనే బయటకు వచ్చినట్టు ఈ వీడియోలు చూస్తుంటే అర్ధమవుతుంది. అందుకే టార్గెట్ మల్లెమాలతో నాగబాబు వీడియోలు ఉన్నాయి. అయితే నాగబాబు వీడియోస్ లో ఆయన్ను సమర్ధించే వారు కొందరైతే ఆయన్ను విమర్శించే వారు కూడా మరికొందరు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: