"అలా వైకుంఠపురం "సినిమా లో అల్లుఅర్జున్ -పూజాహేగ్జే
జంట గా నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే... తెలియకుండా ఎలా ఉంటుంది "మాటల మాంత్రికుడు" గా పేరువచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పక్కర్లేదు.


    దర్శకుడు త్రివిక్రమ్ కి "అ " సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయ్యిది.. తన మూవీ ఫస్ట్ నేమ్ "అ " తో స్టార్ట్ అయినా సినిమాలు అన్ని హిట్టే.
ఇప్పుడు త్రివిక్రమ్ కి "అలా వైకుంఠపురం " సినిమా లో హాట్ ఐటమ్ సాంగ్ లో డాన్స్ వేయడానికి జబర్దస్త్ యాంకర్స్ అయిన అనసూయ మరియి రష్మీ గౌతమ్ అయితే బాగుంటుంది అని భావించారట.. అనసూయ రంగమత్త పాత్ర బాగా ఫేమస్ అయింది కదా! అందుకే ఈ సినిమా లో హాట్ సాంగ్ అనసూయ తో చేయిద్దాం అనుకున్నారట.. అందరు హీరోయిన్స్ తోనే సాంగ్స్ చేయిస్తున్నారు కదా రెగ్యులర్ వాల్లే ఎందుకు? చూసే వాళ్ళకి బోర్ కొడుతుంది. అనే అభిప్రాయంలో ఉన్నారట.. అనసూయ అండ్ రష్మీ అయితే రెమ్యూనిరేషన్ కూడా తక్కువే అవుతుంది అని నిర్మాతలు అనుకుంటున్నారట.


     కానీ బన్నీ మాత్రం ఈ విషయలో త్రివిక్రమ్ కి వ్యతిరేకంగా ఉన్నాడట. సినిమా బాగా వచ్చిందని, అలాగే ఆల్బమ్ కూడా మ్యుజికల్ గా బాగా హిట్ అయిందని, ఇపుడు ఐటమ్ సాంగ్ విషయలో కంప్రమైజ్ అయ్యి నిర్ణయం తీసుకుంటే అ ఎఫెక్ట్ సినిమా మీద పడుతుందని అబిప్రాయపడ్డారట.


నా పక్కన డాన్స్ చేసే హీరోయిన్ "కాజల్" అయితే సినిమా ఒక రేంజ్ లో ఉంటుందని,కాజల్ ని సెలెక్ట్ చేసాడట అల్లు వారి అబ్బాయి.. త్రివిక్రమ్ రెండు సార్లు చెప్పిన, బన్నీ మాత్రం కాజల్ వైపు మొగ్గు చుపేసరికి త్రివిక్రమ్ కంప్రమైస్ అయ్యాడని కాజల్ ని ఫైనల్ చేసేటట్లు ఉన్నారని అనుకుంటున్నారు అందరు.


  కాజల్ అండ్ బన్నీ కాంబినేషన్ లో చాలా మూవీస్ వచ్చాయి.. వీళ్లిద్దరు హిట్ పెయిర్..ఈ ఐటమ్ సాంగ్ లో వీళ్ళద్దరు డాన్స్ చేస్తే బాగుంటుంది అని సినిమా వర్గాల అభిప్రాయం.. చూద్దాం సాంగ్ లో ఎవరు ఫైనల్ అవుతారో . అలా వైకుంఠపురం మూవీ సంక్రాంతి కానుకగా మనముందుకు జనవరి 12 నా రాబోతుంది.. ఇప్పటికె ఆల్బమ్ సూపర్ హిట్ అయి శ్రోతల్ని ఉర్రుతలూగిస్తుంది... ఇందులో పూజ హేగ్జే, టబు, సుమంత్, నవదీప్, సునీల్ నటిస్తున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: