'జబర్దస్త్' కామెడీ షో ద్వారా 'నవ్వుల నవాబు' గా పేరొందిన మెగా బ్రదర్ నాగబాబు మల్లెమాల వారితో చాలా సంవత్సరాల తన ప్రయాణం తర్వాత అర్ధాంతరంగా ఆ షో నుండి వైదొలిగిన సంగతి తెలిసిందే. జబర్దస్త్ నుండి తాను ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది అన్న విషయాన్ని నిదానంగా విడమరచి చెప్తున్న నాగబాబు చివరికి తనకి రావాల్సిన డబ్బుల విషయంలో మనస్పర్ధలు వచ్చి ఆయన ఆ షో నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

 

అయితే బయటకు వచ్చేసిన నాగబాబు ఏమి చేతులు ముడుచుకుని కూర్చోలేదు. తనతోపాటు మొదటినుండి జబర్దస్త్ లో ప్రయాణం చేస్తున్న అనసూయ మరియు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న టాప్ యాంకర్ ప్రదీప్ తో పాటు జీ తెలుగులో ఒక కొత్త షో లో పాల్గొంటున్నాడు.

 

"సర్ సర్లే ఎన్నెన్నో అనుకుంటాం... అన్ని జరుగుతాయా" అనే ఈ షో కి అనసూయ మరియు నాగబాబు జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో వీరిద్దరితో పాటు చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్.పి, యాంకర్ రవి, వేణు టిల్లు, షార్ట్ ఫిలిం స్టార్ దేత్తడి హారిక తదితరులు పర్ఫార్మ్ చేస్తుండగా ప్రదీప్ ఈ షో కి యాంకరింగ్ వహిస్తున్నాడు. ఇకపోతే ఈ షో మొదటి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో లో వీరు జబర్దస్త్ షో పై పరోక్షంగా వేసిన పంచులు అన్నీ ఇన్నీ కావు.

 

ప్రస్తుతం తెలుగు యాంకర్ల లో సుమ తో పాటుగా టాప్ పొజిషన్ లో ఉన్న ప్రదీప్ కి 'కొంచెం టచ్ లో ఉంటే చెప్తా' షో ద్వారా జీతెలుగు తో మంచి అనుబంధం ఏర్పడింది. అతను దాని ద్వారానే నాగబాబు మరియు అనసూయను ఈ షో కి తీసుకుని వచ్చి జబర్దస్త్ ను మించిన షో గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని అంటున్నారు. చూద్దాం మన బాలయ్య బాబు సినిమాలోని డైలాగ్ ని టైటిల్ గా పెట్టుకున్న ఈ కామెడీ షో జబర్దస్త్ రేటింగ్స్ ను కొడుతుందో లేదో.

మరింత సమాచారం తెలుసుకోండి: