ఒకమ్మాయిని అంత్యంత దారుణంగా చంపిన కిరాతకులను ఏ రకంగా శిక్షించాలంటే వారిని చూసిన వారికి ఆమ్మాయిలను చూడాలంటే ఒంట్లో భయం పుట్టాలి. వారికి వేసే శిక్ష ఏ మగ మృగం మరచిపోకుండా ఉండాలి. సమాజంలో మనుషుల మద్య తిరుగుతున్నట్లుగా అనిపించడంలేదు. ఇలాంటి పరిస్దితులను చూస్తుంటే. ఇకపోతే ప్రతి విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించే స్టార్ హీరోలు, దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యాచార ఘటనపై స్పందించకపోవడం వల్ల ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. ..

 

 

ఇంత క్రూరమైన సంఘటన జరిగినా ఎందుకు స్పందించడం లేదంటూ చాలా మంది ప్రశ్నించారు కూడా. అయితే, ఈ ఘటనపై ఎట్టకేలకు మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ఒక వీడియో మెసేజ్‌ను విడుదల చేశారు. అందులో గత రెండు మూడు రోజులుగా రాష్ట్రంలో ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఈ దేశంలో ఆడపిల్లలకు భద్రత లేదనే భావం కలుగుతోంది. మగ మృగాల మధ్య మనం బతుకుతున్నామా అనిపిస్తోంది. మనసు కలిచివేసిన ఈ సంఘటనల గురించి ఒక అన్నగా, ఒక తండ్రిగా స్పందిస్తున్నాను.

 

 

ఇలాంటి నేరాలు చేసిన దుర్మార్గులకు శిక్షలు చాలా కఠినంగా ఉండాలి. భయం కలిగించేలా ఉండాలి. నడిరోడ్డుపై ఉరితీసినా తప్పులేదు. ఇకపోతే నేరస్థులను త్వరగా పట్టుకోవడం అభినందనీయమే. కానీ త్వరితగతిన శిక్ష పడేలా చూడాలి. అప్పుడే ఇలాంటి నేరాలు చేయాలంటే ఎవడైనా భయ పడతాడు. ఆడపిల్లలు అందరికీ నేను చెప్పేది ఒక్కటే. మీ ఫోన్‌లో 100 నంబర్ స్టోర్ చేసి పెట్టుకోండి. అలాగే మీ స్మార్ట్‌ఫోన్‌లో ‘హాక్ ఐ’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి పెట్టుకోండి. ఒక్క బజర్ నొక్కితే చాలు షీ టీమ్స్ హుటాహుటిన మీ దగ్గరకు చేరుకుంటాయి.

 

 

పోలీసు వారి సేవలను అలాగే వారి టెక్నాలజీని మీరు వినియోగించుకోండి. మహిళలకు రక్షణ కల్పించడం, వారిని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత’’ అని ఆ వీడియోలో చిరంజీవి తెలిపారు.. ఇకపోతే ప్రియాంక రెడ్ది అత్యాచారం, హత్య కేసు రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఇక ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి చర్య తీసుకుంటుందో అని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: