రాజ్ తరుణ్ హీరోగా, షాలీనీ పాండే హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం "ఇద్దరి లోకం ఒకటే". ఉయ్యాలా జంపాలా ద్వారా హిట్ అదుకున్న రాజ్ తరుణ్, ఆ తర్వాత వచ్చిన రెండు మూడు సినిమాల్లో ఫర్వాలేదనిపించినా కుమారి ౨౧ ఎఫ్ ద్వారా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలేవీ అనుకున్నంతగా ఆడలేదు. దాంతో ఒక్కసారిగా రాజ్ తరుణ్ కి అవకాశాలు తగ్గిపోయాయి. 

 

ప్రస్తుతం దిల్ రాజు నిర్మాతగా నూతన దర్శకుడు జి ఆర్ క్రిష్ణ దర్శకత్వంలో లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా "ఇద్దరి లోకం ఒకటే" మరి కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి అస్సలు బజ్ కనిపించడం లేదు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నా కూడా మీడియాలో ఈ సినిమా గురించి వార్తలు రావట్లేదు. దీనికి కారణం ఏంటనేది తెలియట్లేదు.

 

దిల్ రాజు సినిమాలన్నీ ప్రమోషన్లలో మంచి జోరు మీద ఉంటాయి. షూటింగ్  దశ నుంచే అప్ డేట్స్ ఇస్తూ తన సినిమాను వార్తల్లో నిలబెట్టే రాజు.. విడుదల ముంగిట పబ్లిసిటీని పీక్స్‌కు తీసుకెళ్తాడు. కానీ ఆయన బేనర్లో తెరకెక్కిన కొత్త చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’ విషయంలో మాత్రం దీనికి భిన్నంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్ల మీద దృష్టి పెట్టకపోవడమ్ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

 

మొదట్లో ఈ సినిమాను క్రిస్మస్ సీజన్లో తన సినిమాను రిలీజ్ చేసేయాలని అనుకున్నారు. కానీ ‘వెంకీ మామ’, ‘రూలర్’, ‘ప్రతి రోజూ పండగే’ లాంటి పెద్ద సినిమాలు రేసులో ఉన్న క్రిస్మస్‌ సీజన్లో ‘ఇద్దరి లోకం ఒకటే’ను రిలీజ్ చేయడం అంటే సాహసమే. మరి క్రిస్మస్ కి రిలీజ్ చేసి సాహసం చేస్తారా లేదా ఇంకా ముందుకు వెళ్తారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: