ఒకప్పుడు హీరోయిన్ గా వెలుగు వెలిగి, ఆ తర్వాత కేరక్టర్ ఆర్టిస్టు గా కొనసాగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. హీరోయిన్ గా కెరీర్ కొన్ని రోజులే ఉంటుంది కాబట్టి, ఆ తర్వాత తమ కెరీర్ ని కేరక్టర్ గా ఆర్టిస్టుగా నిలబెట్టుకుంటారు. ఇలా కేరక్టర్ ఆర్టిస్టుగా నిలబడ్డ వారు చాలా మంది ఉన్నారు. అయితే మరికొందరేమో హీరోయిన్ గా చేసిన తర్వాత మళ్ళీ తెర మీద కనబడరు. ఇలాంటి హీరోయిన్లు కూడా చాలా మంది ఉన్నారు.

 

తెలుగులో ఒకప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేసి పెళ్ళి చేసుకుని అమెరికా వెళ్ళిపోయిన అమ్మాయి లయ. 1999లో వచ్చిన స్వయంవరం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె స్కిన్ షోకి దూరంగా నటనకు ఆస్కారం ఉన్న చిత్రాలు మాత్రమే  చేశారు. ఆమె కెరీర్లో ఎన్నో మంచి మంచి పాత్రలు చేసింది. ప్రేమించు సినిమాలో అంధురాలిగా ఆమె అభినయం అందర్నీ ఆకట్టుకుంది. అయితే హీరోయిన్లకి ఎప్పుడో ఒకప్పుడు బ్రేక్ వస్తుంది. లయకి ఆ బ్రేక్ పెళ్ళి రూపంలో ఎదురైంది.

 

2006లో లయ పెళ్లి చేసుకున్న లయ అమెరికా వెళ్ళిపోయారు. ఆ తర్వాత సినిమాలు చేయడం పూర్తిగా తగ్గించారు.  ఐతే గత ఏడాది శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు. ఆ తరువాత వరుసగా అలాంటి గెస్ట్ గా పాత్రలు చేస్తుందని భావించారు. కానీ లయ మళ్ళీ నటన వైపు చూడలేదు. కానీ ఆమెకి అవకాశాలు చాలానే వచ్చాయట.

 

పెద్ద పెద్ద సినిమాల్లో సైతం ఆమెకు ఆఫర్లు వచ్చాయట. జూ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత లో విలన్ అయిన బుస్సిరెడ్డి భార్య పాత్ర కోసం ముందుగా లయని సంప్రదించారట త్రివిక్రమ్. కానీ ఆమె ఒప్పుకోకపోవడంతో ఆ పాత్రకి ఈశ్వరి గారిని తీసుకున్నారట. ఈ విషయాన్ని లయ ఒకానొక ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఒకవేళ ఆ పాత్ర లయ చేసి ఉంటే ఎలా ఉండేదో కదా...

మరింత సమాచారం తెలుసుకోండి: