అనుష్కా శర్మ బాలీవుడ్లో తనదైన శైలిలో దూసుకెళ్తోంది. మోడలింగ్ ప్రపంచంలో మంచి పేరు సాధించాలన్న తపనతో గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుష్క ముందుగా లాక్మే ఫ్యాషన్ వీక్ లో మెరుపులు మెరిపించింది. లాక్మేతో పాటు సిల్క్ అండ్ షైన్, విస్పర్, నాదెళ్ల జ్యూయలరీ, ఫియట్ పాలియో లాంటి బ్రాండ్లకు ఆమె మెడల్ గా వ్యవహరించింది. యష్ చోప్రాకు చెందిన యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ ఆమె టాలెంట్ గుర్తించి బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సరసన తొలి అవకాశం ఇచ్చింది. 'రబ్ నే బనాదీ జోడీ' సినిమాలో ఆమె నటన విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. భార‌త క్రికెట‌ర్ ను పెళ్లిచేసుకుంది.

 

ఇక ఇదిలా ఉంటే...తన భార్య అనుష్క శర్మ సెలబ్రిటీ కావడంతో, ప్రతి ఒక్కరికీ సులువైన టార్గెట్ గా మారిందని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. వరల్డ్ కప్ ఆడుతున్న వేళ, శ్రీలంకతో మ్యాచ్ ఆడుతుంటే, సెలక్టర్ల బాక్స్ లో అనుష్క కూర్చుందని, ఓ సెలక్టర్ టీ ఇచ్చాడని మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ ఫరూఖ్ ఇంజనీర్ వ్యాఖ్యానించగా, అది వైరల్ అయింది. ఆ సెలక్టర్ ఎవరన్న కొత్త చర్చ నెట్టింట మొదలైంది.

 

దీనిపై 'ఇండియా టుడే'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ మాట్లాడాడు. ఆ రోజు ఏం జరిగిందో చెబుతూ, శ్రీలంకతో మ్యాచ్ చూసేందుకు వచ్చిన తన భార్య ఆమె సెలక్టర్ల బాక్స్‌ లో కూర్చోలేదని, తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఫ్యామిలీ బాక్స్‌ లో కూర్చుందని అన్నాడు. ఆమె పక్కన ఏ సెలక్టర్ లేడని చెప్పాడు. అనుష్క పేరును వివాదాల్లోకి లాగి కొందరు లబ్దిని పొందుతున్నారని ఆరోపించాడు.

 

ఒకవేళ మీరు సెలక్టర్లని విమర్శించాలి అనుకుంటే..? విమర్శించండి. కానీ.. మధ్యలో ఎందుకు నా భార్య అనుష్క శర్మ పేరుని తీసుకొచ్చారు..? గత కొంతకాలంగా ఇలానే ఆమె పేరుని సంచలనాల కోసం ప్రస్తావిస్తున్నారు. అందుకే.. మేము ఇద్దరం ఇలాంటి విషయాల్ని పట్టించుకోవడం మానేశాం’ అని కోహ్లీ స్పష్టం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: