టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ భారీ హిస్టారికల్ మూవీకి దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఎంతో ప్రతిస్తాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే ఇటీవల కొన్నాళ్ల క్రితం ఎన్టీఆర్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్లో వచ్చిన ఫస్ట్ మూవి అరవింద సమేత మంచి హిట్ సాధించి పలు రికార్డ్స్ నమోదు చేసిన విషయం తెలిసిందే. 

 

గోల్డెన్ లెగ్ బ్యూటీ పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఆ సినిమాలో ఈశ్వరి రావు ఒక ముఖ్య పాత్రలో నటించడం జరిగింది. విలన్ పాత్ర పోషించిన జగపతి బాబు భార్యగా నటించిన ఈశ్వరి రావు, ఆ పాత్రలో ఎంతో ఒదిగిపోయి నటించారు అనే చెప్పాలి. వాస్తవానికి ఆ పాత్ర మొదట, సీనియర్ నటి లయను వరించిందట. రెండు రోజుల క్రితం ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో లయ మాట్లాడుతూ, ముందుగా అరవింద సమేత సినిమాలోని విలన్ భార్య పాత్రను చేయాలని త్రివిక్రమ్ గారు నన్ను కలిసి మాట్లాడడం జరిగింది. 

 

అయితే ప్రస్తుతం తనకు వదిన, తల్లి వంటి పెద్ద తరహా పాత్రలు చేయడం ఇష్టం లేదని, నిజానికి తనకు అటువంటి పాత్రలు చేయడానికి మరింత వయసు మరియు పరిణితి రావాలని, కాబట్టి తాను ఆ పాత్ర చేయలేనని త్రివిక్రమ్ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించారట లయ. అయితే తనకు ఎంతో ఇష్టం అయిన ఎన్టీఆర్ గారి సినిమాలో మంచి పాత్ర మిస్ అయినందకు మాత్రం తాను కొంత బాధపడినట్లు చెప్పారు లయ. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని మంచి పాత్రలు వస్తే నటించడానికి తాను సిద్ధం అని లయ అన్నారు. మరి రాబోయే రోజుల్లో ఆమెకు ఎటువంటి ఆఫర్లు వస్తాయో చూడాలి.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: