సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన "సరిలేరు నీకెవ్వరు" చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలకి సిద్ధం అవుతోంది. దూకుడు తర్వాత మహేష్ బాబు చేస్తున్న మాస్ సినిమా కావడంతో జనాల్లో ఈ సినిమాపై అంచనాలు అధికంగా ఉన్నాయి. అదీ గాక ఐఎండీబీ వారు నిర్వహించిన సర్వేలో ఎక్కువ మంది ఎదురుచూస్తున్న సినిమాగా "సరిలేరు నీకెవ్వరు నిలిచింది.

 

ఇటీవల విడుదలైన టిజర్ కి విశేష స్పందన లభించింది. అప్పటి వరకు సినిమాపై ఉన్న అంచనాలని మరింత పెంచిందీ టీజర్. టీజర్ లో మహేష్ చెప్పే డైలాగులు ఆసక్తికరంగా ఉన్నాయి. టిజర్ నుండి స్టార్ట్ అయిన ప్రమోషన్స్ ని మరో రేంజ్ కి తీసుకెళ్ళడానికి రెడీ అవుతున్నారు నిర్మాతలు. అందుకని ప్రతీ సోమవారం ఒక పాట రిలీజ్ చేస్తారట. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పాటలు ప్రతీ సోమవారం ఒకటొకటిగా విడుదల అవుతాయి.

 

అయితే ప్రస్తుతం సినిమా నుండి మరో అప్డేట్ వచ్చింది. ఇప్పటికే దాదాపు టాకీ పార్ట్ పూర్తవగా, సాంగ్స్ చిత్రీకరించే పనిలో పడ్డారట దర్శకుడు అనిల్ రావిపూడి. ఐతే తాజా సమాచారం ప్రకారం వచ్చే 4,5 తారిఖులలో రెండు సాంగ్స్ చిత్రీకరించనున్నారట. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ నేతృత్వంలోని బృందం రేపటినుండి రిహార్సల్స్ మొదలుపెట్టి చిత్రీకరణకు సన్నద్ధం కానున్నారట. ఈ రెండు సాంగ్స్ చిత్రీకరణ కూడా హైదరాబాద్ లోనే ఉంటుందని సమాచారం.

 

అయితే ఈ రెండు పాటలు మహేష్, రష్మిక మధ్య వచ్చే డ్యూయెట్ పాటలని తెలుస్తుంది.  ఈ విషయం అలా ఉంచితే రేపు సోమవారం సరిలేఉ నీకెవ్వరు మొదటి పాట విడుదల కాబోతుంది.  టీజర్ లో నేపథ్య సంగీతం అదరగొట్టిన దేవిశ్రీ పాటల ద్వారా ప్రేక్షకులని ఆకట్టుకుంటాడా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: