ఖాకి  తరువాత రెండు వరస పరాజయాల తో డీలా పడ్డ  తమిళ హీరో  కార్తి  ఇటీవల  ఖైదీ తో బ్లాక్ బాస్టర్ హిట్టు కొట్టాడు.  పాటలు , హీరోయిన్ లేకుండా  కేవలం ఒక్క రాత్రి లో  జరిగే స్టోరీ తో  లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన  ఈచిత్రం తమిళంతోపాటు  తెలుగులోనూ సక్సెస్ కావడంతో  ప్రస్తుతం  కార్తి ఫుల్ జోష్ లో వున్నాడు.   ఈ విజయంతో కార్తి తన తదుపరి  చిత్రాల విషయంలో  మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.  తమిళ్ తోపాటు తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా స్టోరీ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. 
 
 
 
ఇక ప్రస్తుతం కార్తి  ,సుల్తాన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఎప్పుడో  ప్రారంభమైన  ఈ సినిమా  ఇంకా షూటింగ్ ను పూర్తి చేసుకోలేకపోతుంది.  దానికి కారణం సినిమాను మళ్ళీ రీ షూట్  చేస్తున్నారని తెలుస్తుంది.  అందులో భాగంగా ఇప్పటివరకు  తెరకెక్కించిన  కొన్ని సన్నివేశాలు  కార్తి నచ్చలేదట దాంతో స్క్రిప్ట్ లో మార్పులు చేసి  మళ్ళీ రీ షూట్ చేస్తున్నారని  సమాచారం.  దాంతో సినిమా షూటింగ్  ఆలస్యం అవుతుంది.  
 
 
 
రెమో ఫేమ్ భాగ్యరాజ్ కణ్ణన్  డైరెక్షన్ లో  తెరకెక్కుతున్న ఈచిత్రంలో కన్నడ బ్యూటీ  రష్మిక మందన్న  హీరోయిన్ గా నటిస్తుంది. కోలీవుడ్ లో ఇదే ఆమెకు మొదటి సినిమా. డ్రీం వారియర్ పిక్చర్స్ పతాకం పై ఎస్ ఆర్ ప్రభు  నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో  విడుదలకానుంది. ఇక  ఈ సినిమా కంటే  ముందు కార్తిదొంగ తో ప్రేక్షకులముందుకు రానున్నాడు.  దృశ్యం ఫేమ్ జీతూ జోసఫ్ తెరకెక్కించిన  ఈ చిత్రంలో కార్తి  తోపాటు  జ్యోతిక లీడ్ రోల్ లో నటించింది. సెన్సార్  కార్యక్రమాలు కుడా  పూర్తి చేసుకున్న  ఈ చిత్రం తమిళ్ తోపాటు తెలుగులోనూ డిసెంబర్ 20న విడుదలకానుంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: