తాజాగా అమెరికాలో పిలాటస్ పీసీ-12 రకానికి చెందిన విమానం కుప్పకూలి తొమ్మిది మంది దుర్మరణం చండడం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే దక్షిణ డకోటాలోని చెంబర్లీన్ ప్రాంతంలో నేడు మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో పైలట్, ఇద్దరు చిన్నారులు సహా తొమ్మిది మంది మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయ పడ్డం జరిగింది. ఈ ప్రమాద సమయంలో మొత్తం 12 మంది విమానంలో ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటన జరిగిన సమాచారం అందుకున్న నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ బృందం రంగంలోకి దిగి సహాయక చర్యలు తీసుకోవడం జరిగింది. క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రికి హుటా హుటిగా తరలించడం జరిగింది. ఇక చెంబర్లీన్ ఎయిర్పోర్ట్ నుంచి విమానం గాల్లోకి ఎగిరిన కొద్దీ సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. ప్రమాదం జరగడానికి వాతావరణం అనుకూలించకపోవడమే ముఖ్య కారణమని ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. ఉత్తర మైదాన ప్రాంతంలోని దక్షిణ డకోటాలో క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు చోటు చేసుకోవడం జరిగింది.
ప్రస్తుతం ఉత్తర మైదాన ప్రాంతంలో తీవ్రమైన మంచు తుఫాను ఏర్పడటంతో విమాన ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది అని అంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం వరకు మంచు తుఫాను కొనసాగుతోందని జాతీయ వాతవరణ విభాగం హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. దట్టమైన మంచు పేరుకుపోయి, విజిబిలిటీ గణనీయంగా తగ్గిపోతుందని తెలియచేయడం జరిగింది. అమెరికాలో తరుచూ ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవడం జరుగుతున్నాయి ఇలా ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవడం చాల మంచిది.
అక్టోబరులో రెండు ప్రపంచ యుద్ధం నాటి విమాన కుప్ప కూలడం జరిగింది. బ్రాడ్లీ ఎయిర్పోర్టులో 80 ఏళ్ల నాటి యుద్ధం విమానం కుప్పకూలిన ఘటనలో ఇద్దరు పైలెట్లు సహా మొత్తం ఏడుగురు చని పోవడం జరిగింది. ఈ B-17 బాంబర్ విమానం రెండో ప్రపంచ యుద్ధంలో పాల్కొనడం జరిగింది అని చెప్తున్నారు.