మెగా స్టార్ చిరంజీవి తమ్ముడిగా పరిచయం అయిన నాగ బాబు తన అన్న చరిష్మా ని ఉపయోగించు కోలేకపోయాడు అనే చెప్పాలి . కొని రోజుల తర్వాత నిర్మాతగా కూడా మారారు. అన్న కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో తీసిన ఆరంజ్ సినిమా వల్ల మొత్తం పోగొట్టుకున్నారు నాగ బాబు. అలంటి సమయంలో ఈటీవీ లో ప్రచారం అయ్యే జబర్దస్త్ తో వెలుగులోకి వచ్చారు. ఇప్పుడు అదే జబర్దస్త్ ని ఏకి పారేస్తున్నారు నాగ బాబు. 

 

జబర్దస్త్ లో నాగబాబు నవ్వులు, స్కిట్ మధ్యలో ఆయన వేసే పంచులు షోకు మరింత ఆకర్షణ తీసుకొచ్చేవి. అయితే అలాంటి నాగబాబు జబర్దస్త్‌ను నుంచి అకస్మాత్తుగా వెళ్ళిపోవటంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పుడు నాగబాబు తన యూట్యూబ్ చానెల్ ద్వారా జబర్దస్త్ గురించి సంచలన వ్యాఖ్యలు చేయడం ఈ వివాదంని మరింత ముదిరేలా చేస్తుంది .

 

జబర్దస్త్ లో వేణుని చితక్కొట్టిన సంఘటన గురించి ప్రస్థావిస్తూ ఆ సమయంలో ఈటీవీ బృందం వేణుని ఆదుకునే విధంగా ఏమీ చేయలేదని నాగబాబు చెప్పాడు. షోలో వచ్చిన  కొన్ని ఎపిసోడ్స్‌ పై కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి అని అయన చెప్పారు.రకరకాల సంఘటనల వల్ల జబర్దస్త్ ఆర్టిస్టులు తమలోని విశ్వాసాన్ని కోల్పోతే తాను అండగా నిలిచానని తెలిపాడు.కానీ తాను లేకపోతే షో ఏమి ఆగిపోదు అని నాకు తెలుసు అని కూడా అన్నారు. తాను షో ఆర్టిస్టుల మధ్య టీమ్ లీడర్ల మధ్య సంబంధాలని నెలకొల్పేందుకు చాలా చేశానని అయితే అవి అని కూడా యాజమాన్యంకి  తెలియదని వెల్లడించారు.


బుల్లితెరలో ఇంత పెద్ద షోలో నిర్మాణ విలువలు చాలా దారుణంగా ఉండేవని. బయట సమాజంలాగే ఇక్కడ కూడా టీం ఆర్టిస్టులకు నిర్వాహకులకు మధ్య దళారులు ఉండేవారు అని చెప్పారు. వాళ్ల వల్ల చాలా విషయాలు శ్యామ్ ప్రసాద్‌కి తెలిసేవి కాదని అన్నాడు. తన వరకు బాగానే చూసుకున్నారు కాని మిగతా టీం వాళ్లకు భోజనం కూడా సరిగా పెట్టేవారు కాదు అని తన బాధని చెప్పారు నాగ బాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: