స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా అల...వైకుంఠపురములో.... ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈ సినిమాపై సోష‌ల్ మీడియాలో మామూలు బ‌జ్ లేదు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన మూడు లిరిక్స్ సోష‌ల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తూ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి.

 

టాలీవుడ్ లో సంక్రాంతి సినిమాపై ఎలాంటి అంచ‌నాలు ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు అల వైకుంఠ‌పురంలో సినిమాపై సైతం అంతే అంచ‌నాలు ఉన్నాయి. జ‌న‌వ‌రి 12న వ‌స్తోన్న ఈ సినిమా నుంచి రిలీజ అయిన మూడు లిరికల్ సాంగ్స్ విడుదలై మంచి రెస్పాన్స్‌ను రాబట్టుకున్నాయి. అందులో తొలి సాంగ్‌గా విడుదలైన `సామజవరగమన...` సరికొత్త రికార్డును సృష్టించింది.

 

ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా యూ ట్యూబ్‌లో 100 మిలియ‌న్ల వ్యూస్ రాబ‌ట్టింది. ఇది సౌత్ ఇండియా రికార్డుగా నిలిచింది. ఇలాంటి అరుదైన రికార్డు బ‌న్నీ ఖాతాలో ప‌డింది. సౌత్ ఇండియాలో ఒక పాటకు ఇన్ని వ్యూస్ రావడం ఇదే ప్రథమం. ఏదేమైనా ఓ తెలుగు పాట‌కు ఈ రేంజ్‌లో ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారంటే మామూలు విష‌యం కాద‌నే చెప్పాలి. సౌత్‌లో ఎంతో మంది స్టార్లు ఉన్నా వాళ్ల పాట‌లు ఇప్ప‌టి వ‌ర‌కు ఈ రేంజ్ ఆద‌ర‌ణ తెచ్చుకోలేదు.

 

అంతే కాకుండా ఈ సాంగ్‌కు ల‌క్ష‌ల్లో టిక్ టాక్ చేసి మ‌రో రికార్డు నెల‌కొల్పారు. సుప్రసిద్ధ గేయ రచయిత శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రచించిన ఈ గీతానికి థ‌మన్ అద్భుతమైన ట్యూన్ అందించారు. గాయకుడు సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట ఇంకా టాప్ ట్రెండింగ్‌లో దూసుకు పోతోంది. బ‌న్నీ స‌ర‌స‌న పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టించిన ఈ సినిమాలో చాలా రోజుల త‌ర్వాత సీనియ‌ర్ హీరోయిన్ ట‌బు కూడా ఓ కీల‌క పాత్ర‌లో న‌టించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: