వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి ఘటనపై జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. దేశం మొత్తం ఈ సంఘటనని ఖండిస్తున్నారు. నిందితులకు వెంటనే శిక్ష పడేలా చేయాలని అంటున్నారు. ప్రియాంకా రెడ్డికి జరిగిన ఘోరం మరెవరికి జరుగకూడదని అంటున్నారు. ఇక ఈ విషయంపై ఇప్పటికే చాలామంది సెలబ్రిటీస్ స్పందించారు. లేటెస్ట్ గా మహేష్ బాబు కూడా తన స్పందన తెలియచేశాడు.

 

రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా ఏం మారలేదని.. ప్రతిసారి సమాజంగా మనం ఓడిపోతూనే ఉన్నామని.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు తన విన్నపంగా ఇలాంటి దుశ్చర్యలకు కఠినమైన శిక్షలు ఉండేలా చూడాలని అన్నారు. అందరం కలిసి బాధితులకు న్యాయం కలిగేలా చేయాలని అన్నారు. మహిళలకు న్యాయం జరిగేలా.. ఇండియాను కాపాడుకుందామని పిలుపునిచ్చారు.

 

అంతేకాదు ఓ వాయిస్ మెసేజ్ కూడా పెట్టారు మహేష్ బాబు. ప్రస్తుతం మహేష్ వాయిస్ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎవరి కళ్లలో సంస్కారం సూర్యకాంతిలా మెరుస్తుందో.. ఎవరిమాట మన్ననగా ఉంటుందో.. అంటూ మొదలు పెట్టి స్త్రీకి నిజమైన స్నేహితుడు, సహచరుడు, ఆత్మాయుడు ఒక్కమాటలో చెప్పాలంటే వాడే మగాడు అని ఇచ్చిన వాఇస్ మెసేజ్ అందరిని ఆకట్టుకుంది. 

 

కేవలం స్క్రీన్ పైన హీరోలా కాకుండా బాధ్యతగల వ్యక్తిగా సమాజంలో జరుగుతున్న ఈ దుశ్చర్యలను ఖండిస్తూ మహేష్ ఇచ్చిన ఈ మెసేజ్ కు మంచి స్పందన వస్తుంది. మహేష్ తన సోషల్ బ్లాగ్ లో చేసిన కామెంట్స్ తో పాటుగా రిలీజ్ చేసిన ఆడియో మెసేజ్ కూడా బాగా వైరల్ అయ్యింది.  రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి కూడా తన వీడియో మెసేజ్ తో నిందితులను బహిరంగంగా ఉరితీయండన్న మెసేజ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేయగా లేటెస్ట్ గా మహేష్ మెసేజ్ అందరిని ఆకట్టుకుంటుంది. స్పందించడం కాస్త లేటైనా సరే మహేష్ ఇచ్చిన మెసేజ్ అందరి హృదయాలకు తాకేలా ఉందని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: