పాలిటిక్స్ నుండి సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస విజయాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా ఏంటో నిరూపిస్తున్న మెగాస్టార్ చిరంజీవి వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నాడు. ఖైదీ నెంబర్ 150, సైరా సినిమాలతో అదిరిపోయే విజయాలు అందుకున్నాడు చిరంజీవి. ముఖ్యంగా ఇటీవల గాంధీ జయంతి సందర్భంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సైరా సినిమాతో కళ్ళు చెదిరే కలెక్షన్లు కొల్లగొట్టిన చిరంజీవి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఉన్నాను బాహుబలి రికార్డులను బద్దలు కొట్టడం జరిగింది. అంతేకాకుండా తన కెరియర్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా తో అత్యధిక ఫాస్టెస్ట్ కలెక్షన్లు రాబట్టడం జరిగింది.

 

ఇదే జోరు కొనసాగిస్తూ సైరా సినిమా సినిమా హాల్లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సమయంలోనే...తన నెక్స్ట్ సినిమా కొరటాలతో చేయబోయే సినిమా పూజా కార్యక్రమాలు దసరా పండుగ సందర్భంగా చిరంజీవి మొదలుపెట్టిన సంగతి అందరికీ తెలిసినదే. అయితే ఆ సినిమాకి సంబంధించి ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదల కాకముందు సినిమాకి సంబంధించి అధికార ప్రకటనలో ఏవీ కూడా ఇంకా బయటకు రాని నేపథ్యంలో రకరకాల వార్తలు ఈ సినిమాపై ఇండస్ట్రీలో మరియు సోషల్ మీడియా లో వినిపిస్తున్నాయి.

 

విషయంలోకి వెళితే ఈ సినిమాలో చిరంజీవితో హీరోయిన్ శ్రేయ నటిస్తున్నట్లు తాజాగా లేటెస్ట్ కొత్త న్యూస్ సోషల్ మీడియాలో మరియు ఇండస్ట్రీలో చాలా గట్టిగా వినబడుతోంది. అంతేకాకుండా ఈ సినిమాలో గతంలో హీరోయిన్ గా త్రిష ఎంపికైనట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ సినిమాకి సంబందించి రెగ్యులర్ షూటింగ్ మొదలు కాకముందే రకరకాల వార్తలు వినబడుతున్న తరుణంలో అభిమానులు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటున్న నేపథ్యంలో వస్తున్న వార్తలపై సినిమా యూనిట్ స్పందిస్తే బాగుంటుందని చాలా మంది సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు అంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: