తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ వెండితెరపై అలరించిన బ్రహ్మానందం ప్రస్తుతం సినిమాలో చాలా తక్కువ అవకాశాలు అందుకుంటూ బుల్లితెరపై రాణిస్తున్నారు. కొన్ని సంవత్సరాల నుండి స్టార్ హీరోలందరి పక్కన నటిస్తూ తరాలు మారినా బాక్సాఫీస్ నీ శాసించే కొత్త హీరోలు వచ్చిన బ్రహ్మానందం డిమాండ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇటీవల కొంత అనారోగ్య కారణాలు బ్రహ్మానందం ఇంటికే పరిమితం కావడం తర్వాత బుల్లితెరపై కొన్ని రియాలిటీ షోలకు వస్తు కెరీర్ను కొనసాగిస్తున్న క్రమంలో తాజాగా కర్ణాటకలో బ్రహ్మానందం పర్యటించడం తో బ్రహ్మానందం కి ఉన్న క్రేజ్ దెబ్బకు కర్ణాటకలో ట్రాఫిక్ జామ్ అయ్యింది.

 

విషయంలోకి వెళితే బ్రహ్మానందం కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌ నియోజకవర్గ ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. స్థానిక బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ కె. సుధాకర్ తరఫున బ్రహ్మానందం వీరసంద్ర ప్రాంతంలో ప్రచారం నిర్వహించారు.  బ్రహ్మానందం రోడ్ షోతో చిక్కబళ్లాపురం రోడ్లు కిక్కిరిసిపోయాయి. ఇప్పుడు సుధాకర్ ను గెలిపించాలని ఎన్నికల ప్రచారం కోసం ఇక్కడి వచ్చాను, విజయోత్సవం రోజు మళ్లీ ఇక్కడకు వస్తానని బ్రహ్మానందం స్థానికులకు చెప్పారు. దీంతో కర్ణాటక రాష్ట్రంలో బ్రహ్మానందం కామెడీ ని ప్రేమించి చాలామంది అభిమానులు రావడం జరిగింది అంతేకాకుండా ప్రచారంలో బ్రహ్మానందం చెప్పిన స్పీచ్ చాలా శ్రద్ధగా విని తర్వాత బ్రహ్మానందం తో సెల్ఫీ దిగి ఎందుకు జనం ఎగబడటంతో అక్కడ కొంత గందరగోళం నెలకొంది.

 

ఇదే క్రమంలో ట్రాఫిక్ జామ్ చాలా దారుణంగా కావడంతో బ్రహ్మానందం జిందాబాద్ అంటూ తెలుగు ప్రజలు గట్టి గట్టి నినాదాలు చేస్తూ బ్రహ్మానందం కి స్వాగతం పలికారు. కర్ణాటక రాష్ట్రంలో బ్రహ్మానందం క్రేజ్ చూసి ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా బ్రహ్మానందం పర్యటించిన చిక్కబళ్లాపురంలో ఎక్కువగా ఉండేది తెలుగు వారు మాత్రమే కావడంతో బ్రహ్మానందం ఎన్నికల ప్రచారానికి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: