అల్లు అర్జున్ ప్రధాన పాత్ర పోషిస్తున్న అల వైకుంఠపురం చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. జనవరి 12 వ తేదీన ప్రేక్షకుల ముందుకు సంక్రాంతి కానుకగా ఈ సినిమా రాబోతుంది. డీజే తర్వాత అందాల భామ పూజ హెగ్డే అల్లు అర్జున్ సరసన నటిస్తూ ఉంది. ఈ సినిమాలో ముఖ్య పాత్రలో సీనియర్ నటి టబు కూడా నటిస్తున్నారు. అలాగే సుశాంత్, నివేత పేతురాజ్ కూడా నటిస్తున్నారు.

 

 నిన్న నివేత పేతురాజ్ పుట్టినరోజు సందర్భంగా సినిమా లోని ఆమె మొదటి లుక్ ను సినిమా లో విడుదల చేశారు. మొదట అందరు అనుకున్నట్లు నివేదా పేతురాజ్ అల్లు అర్జున్ కి లవర్ గా కాకుండా  సుశాంత్ కి లవర్ గా సరసన నటిస్తుందని చెప్తున్నారు. సుశాంత్ ఈ చిత్రంలో అల్లు అర్జున్ కి సోదరుడిగా నటిస్తారని తెలుస్తోంది. కెరీర్లోనే తొలి సారిగా సుశాంత్సినిమా కోసం ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా  మారాడు. సుశాంత్ చివరిసారిగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన "చి ల సౌ" సినిమాలో నటించాడు.

 

 త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూడవ చిత్రం అల్లు అర్జున్ కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఇప్పటికే, విడుదలైన రెండు పాటలు కూడా ఎంతో మంచి ఆదరణ పొందాయి. నివేత పేతురాజ్ టాలీవుడ్లో మెంటల్ మది సినిమాతో తెరంగ్రేటం చేసింది. నివేత పేతురాజ్ తెలుగులో తర్వాత బ్రోచేవారెవరురా ,చిత్రలహరి చిత్రంలో కూడా నటించింది. తమిళంలో ఈ అమ్మడికి చాలా మంచి క్రేజ్ ఉంది.


అల్లు అర్జున్ తో పాటు అల వైకుంఠ పుర్రంలో  జయరామ్, మురళి శర్మ, సుశాంత్, నవదీప్, నివేదా పెతురాజ్, సునీల్ మురళి శర్మ, సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, రాహుల్ బ్రహ్మకీ,  నాసర్ సహాయక పాత్రలలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: