పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. జనసేన పార్టీ అధినేతగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికారంలో ఉన్న పార్టీ పై ప్రతిపక్ష పార్టీ కంటే ఎక్కువగా ప్రశ్నిస్తూ తనదైన శైలిలో రాజకీయం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ తో గతంలో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో బద్రి సినిమాలో హీరోయిన్ గా నటించిన అమీషా పటేల్ కి ఇటీవల కోర్టు నుండి నోటీసులు అందినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో అమీషా పటేల్ నటించిన బద్రి అనే మొట్టమొదటి సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. సినిమాలో విలన్ ప్రకాష్ రాజు చెల్లెలుగా నటించిన అమీషా పటేల్ నటన సినిమాకే హైలెట్ అని చెప్పడం ఎటువంటి సందేహం లేదు. సినిమా అంత సూపర్ డూపర్ హిట్ అవడానికి గల కారణాలలో అమీషా పటేల్ పెర్ఫార్మెన్స్ కూడా ఒకటి.

 

అయితే బద్రి సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబు పక్కన నాని సినిమాలో హీరోయిన్ గా చేసి తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పక్కన నరసింహుడు అనే సినిమాలో నటించిన అమీషా పటేల్ తర్వాత పరమవీరచక్ర సినిమా లో బాలకృష్ణ పక్కన హీరోయిన్ గా నటించడం జరిగింది. ఒక్క బద్రి సినిమా మినహా అమీషా పటేల్ నటించిన తెలుగు మిగతా సినిమాలు మొత్తం షాపు కావడంతో బాలీవుడ్లో నటించి తనకంటూ సపరేట్ మార్కెట్ ఏర్పరచుకుంది.

 

అంతేకాకుండా హీరోయిన్ గా బాలీవుడ్ లో సైతం మంచిపేరు తెచ్చుకున్న అమీషా పటేల్ ఓ ప్రొడక్షన్ హౌస్ నుంచి రూ. 10 లక్షలు అప్పుగా తీసుకుంది.  ఆ తరువాత ఆ ప్రొడక్షన్ హౌస్ కు ఓ చెక్ ఇచ్చింది. కానీ, ఆ చెక్ బౌన్స్ కావడంతో ప్రొడక్షన్ కంపెనీ కోర్టులో చెక్ బౌన్స్ కేసు దాఖలు చేసింది. కేసు విచారించిన మధ్యప్రదేశ్ కోర్టు 43 ఏళ్ల అమీషా పటేల్ కు నోటీసులు జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 27 వ తేదీలోపు కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ వార్త ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో మరియు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: