టాలీవుడ్ లెజెండరీ నటుడు మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ స్టామినా ఎలాంటిదో గత నాలుగు దశాబ్దాలుగా తెలుగు ఇండస్ట్రీ చూస్తూనే ఉంది. ఇటీవ‌లె ఆయ‌న  నటించిన తాజా చిత్రం “సైరా”తో భారీ ఓపెనింగ్స్ రాబట్టి తనకి ఎవరూ సాటి కారని నిరూపించుకున్నారు.అలాగే ఈ చిత్రం తర్వాత మెగాస్టార్ మరియు కొరటాల శివతో ప్రాజెక్ట్ అనగానే ఈ చిత్రంపై టాలీవుడ్ శ్రేణుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

 

అయితే ఈ ప్రాజెక్ట్ ఖరారు అయ్యి చాలా కాలం అయినా ఈ సినిమాకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటనలు ఏవీ బయటకు రాకపోడం అభిమానులను మరింత నిరాశ పరుస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమాపై మరిన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.ఈ సినిమాలో మెగాస్టార్ సరసన మరోసారి శ్రేయ జత కట్టబోతుంది అని రకరకాల వార్తలు మొదలవుతుండడంతో ఇప్పటికే సినిమా కోసం ఏ అప్‌డేట్ లేక సతమతమవుతున్న మెగా ఫ్యాన్స్ ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తున్న వారి పై ఫైర్ అవుతున్నారు.

 

ఇక ఈ సినిమాకి సంగీత దర్శకడు ఎవరు అన్నది ఇంకా తేలలేదు. వాస్తవానికి కొరటాల అన్ని సినిమాలకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం చేసుకుంటూ వచ్చారు. కానీ ఈ సినిమాకి మాత్రం చాలా మంది సంగీత దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. అందులో సైరాకి సంగీతం అందించిన అమిత్ త్రివేది పేరు ఎక్కువగా వినిపించింది. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ లో మణిశర్మ పేరు వినిపిస్తుంది. గతంలో మణిశర్మ చిరంజీవి సినిమాలకి ఆస్థాన సంగీత దర్శకుడిగా ఉండేవాడు. ఇప్పుడు మళ్ళీ ఈ కాంబినేషన్ ని రిపీట్ చేయాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉనట్టు తెలుస్తుంది. ఈ మధ్య మణిశర్మ సంగీతం అందించిన లై, ఇస్మార్ట్ శంకర్ సినిమాలు బాగా హిట్టు అయ్యాయి. దీనితో మణి ఈజ్ బ్యాక్ అని చాలా మంది అన్నారు. ఇప్పుడు మణిశర్మని ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా తీసుకోవాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: