ప్రస్తుతం తెలుగు టెలివిజన్ ఛానల్స్ లో ప్రసారం అవుతున్న షోల్లో మంచి రేటింగ్స్ మరియు అద్భుతమైన ప్రేక్షకాదరణతో ముందుకు దూసుకెళ్తున్న షోల్లో జబర్దస్త్ షో కూడా ఒకటి. ఈటివి ఛానల్ లో దాదాపుగా ఏడేళ్లుగా ప్రసారం అవుతున్న ఈ కామెడీ షో గురించి తెలియని తెలుగు వారు ఉండరు అనే చెప్పాలి. ఇక ఇదే షోకు కొన్నేళ్లుగా రోజా మరియు నాగబాబు జడ్జీలుగా వ్యవహరిస్తుండగా, అనసూయ మరియు రష్మీ యాంకర్స్ గా వ్యవహరిస్తున్నారు. అలానే ఈ షో ద్వారా ఎంతో మంచి పేరు సంపాదించి పాపులరైన కొందరు పార్టిసిపెంట్స్, ఇటీవల సినిమాల్లో కూడా మంచి అవకాశాలతో దూసుకుపోతున్నారు. 

 

కాగా ఇనేళ్ళూ ఎటువంటి అరమరికలు లేకుండా దిగ్విజయంగా సాగిన ఈ షో నుండి ఇటీవల నాగబాబు బయటకు రావడంతో, షోలో ఏవైనా విబేధాలు మొదలయ్యాయా అనే అనుమానం చాలా మందిలో కలిగింది. అయితే అటుఅంతిది ఏమి లేదని, దాదాపుగా ఏడేళ్ల నుండి నాగబాబు గారు ఇదే షోకు జడ్జీగా వ్యవహరిస్తున్నందు వల్ల, తాత్కాలికంగా కొంత బ్రేక్ తీసుకోవాలని ఆయన షో నుండి నిష్క్రమించినట్లు వార్తలు వచ్చాయి. అయితే అది నిజం కాదు, జబర్దస్త్ ను నిర్వహిస్తున్న మల్లెమాల సంస్థలోని కొందరు నిర్వాహక సభ్యుల ప్రవర్తన తనకు నచ్చకపోవడం వల్లనే తాను బయటకు వచ్చినట్లు నాగబాబు నిన్న ఒక వీడియో రిలీజ్ చేస్తూ చెప్పారు. ఇకపోతే అతి త్వరలో ఈ షో నుండి అనసూయ మరియు చమ్మక్ చంద్ర కూడా బయటకు రానుండగా, 

 

షో నిర్వాహకుల్లో కొంత భయం మొదలైనట్లు సమాచారం. అయితే అనసూయ, చమ్మక్ చంద్ర లతో పాటు సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, హైపర్ అది కూడా బయటకు వచ్చే సూచనలు ఉన్నాయి అనే వార్తలు కూడా ప్రచారం అవడంతో, వెంటనే అలర్ట్ అయిందట జబర్దస్త్ టీమ్. అనంతరం బయటకు వెళ్ళడానికి సిద్ధం అయిన చమ్మక్ చంద్ర, అనసూయ దారిలోనే మిగతా వారిని కూడా వెళ్లకుండా పలు విధాలుగా సయోధ్య కుదిర్చేందుకు రోజా సహా మరికొందరిని మధ్యవర్తులుగా రంగంలోకి దించారట. అయితే చివరిగా వారి రాజీ రాయబారాలు ఫలించి, మిగతావారెవరూ కూడా షో నుండి బయటకు వెళ్లకూడదని నిర్ణయించారట. ఈ విధంగా అనసూయ దెబ్బకు జబర్దస్త్ టీమ్ కొంత భయపడినట్లే అని అంటున్నారు విశ్లేషకులు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: