అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ మీద ప్రేక్షకులకి విపరీతమైన క్రేజ్ ఉంటుందన్న విషయం ఇంతకముందు వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు నిరూపించాయి. మళ్ళీ ఇదే కాంబినేషన్ లో హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి రెడీ అవుతున్న సినిమా అల వైకుంఠపురములో. ఈ సినిమా మీద ముందు అంతగా బజ్ లేదనే చెప్పాలి. కానీ రాను రాను సినిమా మీద విపరీతంగా ప్రేక్షకుల్లో క్రేజ్ పెరిగిపోయింది. ముందు బన్నీ లుక్ రిలీజ్ చేశారు. అప్పుడే ఈ సినిమా మీద జనాల్లో ఆసక్తి పెరిగింది. ఆ తర్వాత చిన్న గ్లింప్స్, ఆ తర్వాత రిలీ చేసిన సామజవరగమన సాంగ్ తో ఇక ఈ సినిమా మీద వచ్చిన క్రేజ్ ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి రాలేదు. అంతేకాదు ఆ తర్వాత వచ్చొన రాములో రాముల కూడా సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అని జనాలందరు ఫిక్సైయ్యోలా చేసింది. 

 

10 మిలియన్ వ్యూస్ రొటీన్.. 100 మిలియన్ల వ్యూస్ సాధిస్తేనే  గొప్ప అన్నట్టుగా ఉంది హీరోక మధ్య పోటీ. వంద మిలియన్లు అంటే ఏకంగా 10 కోట్ల వ్యూస్ అని అర్థం. సోషల్ మీడియా .. డిజిటల్ స్పీడ్ కొనసాగుతున్న ఈ రోజుల్లో ఈ స్థాయిని స్టార్ హీరోలు అందుకుంటున్నారు. ప్రమోషన్ ఏకంగా ఆకాశాన్ని అంటుకుంటున్నాయి. తాజాగా.. అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ నుంచి బయటకు వచ్చిన తొలి గీతం సామజవరగమన.. ఈ అరుదైన ఫీట్ ని అందుకుంది. ఈ సాంగ్ రిలీజైంది మొదలు యూట్యూబ్ లో జెట్ స్పీడ్ తో దూసుకుపోయింది. అతి తక్కువ సమయంలో అత్యధిక వ్యూస్ సాధించిన లిరికల్ సాంగ్ గా పాపులరైంది. అలా రికార్డుల్ని సృష్ఠించి 10 కోట్ల వ్యూస్ క్లబ్ లో చేరింది. యూట్యూబ్ మాధ్యమంలో ఇంతమందిని ఈ పాట ఆకట్టుకుందంటే అర్థం చేసుకోవచ్చు.

 

థమన్ తన కెరీర్ లో మరో రికార్డ్ బ్రేకింగ్ ట్యూన్ అందించాడన్న ప్రశంసలు దక్కాయి. సిధ్ శ్రీరామ్ ఈ పాటను పాడటం కూడా ఎంతో ప్లస్ అయింది. అతనికి ఈ పాటతో విప్పరీతమైన క్రేజ్ వచ్చేసింది. ఇక ఇదే ఊపులో అల వైకుంఠపురములో తదుపరి ప్రమోషన్ కి రంగం సిద్ధమవుతోంది. డిసెంబర్ 2న ఓ స్పెషల్ టీజర్ ని రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అంతేకాదు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా సరిలేరు నీకెవ్వరు తో భారీ పోటీకి సిద్దమవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: