టాలీవుడ్ లో బాగా టూర్లకు వెళ్లే దంపతులు ఎవరు అంటే టక్కున మహేష్ బాబు, నమ్రత  అంటారు. కానీ వారిని దాటిపోయే రేంజ్ లో ఈ మధ్య నాగ చైతన్య, సమంత దంపతులు ఎక్కువ టూర్లు చేస్తున్నారు. ప్రేమించిన నాగ చైతన్య పెళ్లి చేసుకున్న తర్వాత సమంత తన లైఫ్ ని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది. దాదాపు పదేళ్ల ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకున్న ఈ జంట ఆ మధుర క్షణాలను చాలా బాగా ఆస్వాదిస్తున్నారు.

 

 రీసెంట్గా నాగచైతన్య జన్మదినం సందర్భంగా సమంత ఒక ఎమోషనల్ ట్వీటీని ఎంతగా వైరల్ అయ్యిందో మనందరికీ తెలిసినదే. నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా నీ సంతోషానికి నేను ఎప్పుడు ప్రార్థనలు చేస్తూ ఉంటాను. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది.. రోజు రోజుకు నువ్వు చాలా ఎదుగుతున్నావు.. నీకు నువ్వే బెస్ట్ అనిపించుకుంటున్నావు.. మన ఇద్దరి మధ్య బంధం చాలా దృఢమైనదని నేను మనస్పూర్తిగా నమ్ముతున్నాను. ఐ లవ్యూ డార్లింగ్‌ అంటూ సమంత చేసిన ట్వీట్ హల్ చల్ చేసింది.

 

అలాగే  భర్త పుట్టినరోజు సందర్భంగా సమంత భారీగా ప్లాన్ వేసిందట. భర్త బర్త్ డే సెలబ్రేషన్స్ ను విదేశాలలో జరుపుకోవాలని సమంత ప్లాన్ చేసిందట. చివరికి సింగపూర్ కి వెళ్లాలని ఈ జంట నిర్ణయం చేసుకున్నారని తెలుస్తోంది. వీరిద్దరూ గత కొన్ని రోజులుగా అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు.

 

అక్కడ ఉన్న వీధుల్లో తిరుగుతూ, రెస్టారెంట్లలో తమకు నచ్చిన ఫుడ్డు ని టేస్ట్ చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారట. ప్రస్తుతం నాగ చైతన్య వెంకటేష్ తో కలిసి వెంకీ మామ చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే శేఖర్ కమ్ముల తో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. మరో వైపు సమంత కూడా తొలిసారి  ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ లో నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: