జబర్దస్త్ నుంచి బయటికెళ్లిపోయిన నటుడు నాగబాబు ఇప్పుడు ఆ కార్యక్రమంపై వరుసగా వీడియోలు విడుదల చేస్తున్నాడు. తాజాగా వీడియోలో మరిన్నిబాంబులు పేల్చారు. జబర్ధస్త్‌పై కార్పొరెట్ ఇంపాక్ట్ పడడంతో ట్యాలెంట్ అనేది సంస్థను వదిలి వెల్లిందని నాగబాబు విమర్శించాడు. ఇంత పెద్ద షోలో నిర్మాణ విలువలు దారుణంగా ఉండేవని.. జబర్దస్త్‌లో పనిచేసేవాళ్లు మల్లెమాల బాగు కోసమే కష్టపడినా.. ఎవరి గురించి పట్టించుకోలేదని నాగబాబు అన్నాడు.

 

టీం ఆర్టిస్టులకు నిర్వాహకులకు మధ్య దళారులు ఉన్నారని .. వాళ్ల వల్ల చాలా విషయాలు శ్యామ్ ప్రసాద్‌కి తెలిసేవి కాదని నాగబాబు అన్నాడు. ఇవన్నీ శ్యామ్‌కి తెలియదు అనే తాను అనుకుంటున్నానన్నాడు నాగబాబు. ఒకవేళ తెలిసి జరిగితే తానేం చేయలేనని నాగబాబు అన్నాడు. తనను బాగానే చూసుకున్నారు కాని మిగతా టీం వాళ్లకు ఫుడ్ కూడా సరిగా పెట్టేవారు కాదు అని తీవ్రంగా విమర్శించాడు నాగబాబు.

 

అంతేకాదు.. కమెడియన్ వేణుని చితక్కొట్టిన ఘటన గురించి ప్రస్తావించారు. అప్పుడు కూడా ఈటీవీ-శ్యాం బృందం ఆ ఆర్టిస్టుకు ఏమీ చేయలేదని నాగబాబు గుర్తు చేసుకున్నాడు. కొన్ని ఎపిసోడ్స్‌పై కోర్టులో కేసు నడుస్తోందని నాగబాబు తెలిపాడు. దానికి మాత్రమే మల్లెమాల అధినేత సహా ఈటీవీ వర్గాలు స్పందించారన్నాడు. అలాంటి కార్పొరెట్ గొడవలు పట్టించుకున్నట్టు ఇతర విషయాలేవీ పట్టించుకోరని నాగబాబు సెటైర్ వేశాడు.

 

ఆయన ఇంకా ఏమన్నారంటే.. “ రకరకాల దెబ్బల వల్ల ఆర్టిస్టులు టీమ్ లీడర్లు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతే తాను అండగా నిలిచా.. కలిసి పోరాడదామని అన్నా.. ఎవరి మనోభావాలో దెబ్బతింటాయని సైలెంట్‌గా ఉండాలా? లీగల్‌గా సమస్యలు వస్తే కోర్టులు ఉన్నాయి కదా.. ఛానల్ సమస్యల్ని డీల్ చేస్తారు కానీ.. వ్యక్తిగతంగా పట్టించుకోరు.” అన్నాడు నాగబాబు. మరి ఈ నాగబాబు జబర్దస్ పై ఇంకెన్ని బాంబులు వేస్తాడో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: