గతకొన్ని రోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమ లో జరుగుతున్న పరిణామాలు మరియు సినిమా ప్రముఖులపైనా వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. ఈ టీవీ లో ప్రసారం అయ్యే జబర్దస్త్ కార్యక్రమం నుంచి న్యాయనిర్ణేతలుగా ఉన్న నాగబాబు మరియు రోజాలు మానేయడం, సంచలన నటి శ్రీ రెడ్డి మరో అడుగు ముందుకేసి రాంగోపాల్ వర్మతో డేటింగ్ చేయాలనీ ఉంది అని ప్రకటించడం మొదలైనవి సంచలనం వార్తలుగా మారాయి. కొన్ని నెలలనుండి సోషల్ మీడియా ఫేస్బుక్ ద్వారా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తు పెట్టిన పోస్టులు మరియు ప్రముఖ సినీ నటులపైనా దర్శకులపైనా ఆరోపణలు గుప్పించిన ఆమె మరో సంచలన ప్రకటన చేసింది. అయితే అసలు వివరాల్లోకి వెళ్తే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా లోని వివిద పాత్రలతో రాజకీయ సంచలనం సృష్టిస్తూ వివాదాలకు తెరలేపిన ఈ దర్శకుడు ఎల్లప్పుడూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతూవుంటాడు. అయితే ఇప్పుడు ఇతని కొత్త సినిమాలో సృష్టించిన పాత్రలకు వారు చేసే నటనకు ముగ్దురాలు అయిన శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసే ఈమెకు వర్మ కొత్త చిత్రం బాగా నచ్చి అవకాశం ఇస్తే రాంగోపాల్ వర్మతో సహజీవనం చేయడానికి నేను సిద్ధమని ప్రకటించింది. తాజాగా రామ్ గోపాల్ వర్మను ప్రస్తావిస్తూ నాతో డేట్కి వస్తావా? అంటూ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టింది ఈ వివాదాస్పద నటీమణి. అక్కడితో కూడా ఆగకుండా ఏకంగా బూతు పురాణం మొదలు పెట్టిన్నట్లుగా మరికొన్ని కామెంట్లు కూడా చేసింది.
బట్టలు విప్పుకొని తెలుగు సినీపరిశ్రమలో సంచలనం సృష్టించిన వివాదభరిత కామెంట్స్ చేరిన ఈమె ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ తో డేటింగ్ చేయడానికి ఆయన ఒప్పుకుంటే రెడీ అని చెప్పడం తో సినీ పరిశ్రమలో చాలా మంది హీరోయిన్లు శ్రీరెడ్డి ని దూషించం మొదలుపెట్టారు.