సామజవరణ గమన.. ఈ పాట ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. కానీ ఈ పాట ఊహించిన దాని కంటే ఎక్కువ రికార్డులు తెచ్చిపెడుతోంది. ఈ సాంగ్ విడుదలైన రోజు నుంచే

సంచలనాలు క్రియేట్ చేస్తోంది. వేగంగా వ్యూస్ రాబడుతూ అరుదైన రికార్డులు సాధిస్తోంది. తాజాగా ఈ సాంగ్ సౌత్ ఇండియా చరిత్రలోనే సరి కొత్త రికార్డ్ సృష్టించింది.

 

ఈ మ్యూజికల్ హిట్ ‘సామజవరగమన' పాటకు 100 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అది కూడా అతి తక్కువ సమయంలో... యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతూ వస్తున్న ఈ సాంగ్ తాజాగా ఈ అరుదైన ఫీట్ సాధించింది. సౌత్ ఇండియాలో ఒక పాటకు ఇంత వేగంగా ఇన్ని వ్యూస్ రావడం ఇదే ఫస్ట టైమ్. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న ‘అల వైకుంఠపురంలో' సినిమాలోని పాట ఈ ‘సామజవరగమన'.

 

రికార్డ్ స్థాయి వ్యూస్ సాధించిన ఈ తెలుగు పాటకు నెటిజన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ఈ పాట గురించి మరిన్ని వివరాలు ఏంటంటే.. సుప్రసిద్ధ గేయ రచయిత శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఈ పాట రాయగా.. ఈ గీతానికి తమన్ అద్భుతమైన ట్యూన్స్ అందించారు. సూపర్ హిట్ పాటల గాయకుడు సిద్ శ్రీరామ్ ఈ పాటకు ప్రాణం పోసారు. క్లాస్, మాస్ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుంటూ దూసుకెళ్తోందీ పాట.

 

ఇక ఈ అల వైకుంఠపురములో.. సినిమా గురించి చెప్పాలంటే.. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబోలో రూపుదిద్దుకుంటోందీ చిత్రం. గీతా ఆర్ట్స్ బ్యానర్‌, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో తెరకెక్కుతోంది. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌. ఇంకా ఈ మూవీలో సుశాంత్, నివేదా పేతురాజ్, టబు కీలక పాత్రలు. సినిమా సంక్రాంతి కానుకగా రాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: