సూపర్ స్టార్ మహేష్ బాబు-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ప్రస్తుతం   ఈచిత్రం యొక్క షూటింగ్  తుది దశకు చేరుకుంది.  ఇక ఇప్పటికే  ఈ చిత్రం యొక్క ప్రమోషన్స్ కూడా  స్టార్ట్ చేశారు.  అందులో భాగంగా   ఇటీవల ఈచిత్రం యొక్క  టీజర్ ను విడుదలచేయగా  25 మిలియన్ల  పై చిలుకు వ్యూస్ తో  రికార్డు  క్రియేట్ చేసింది. ఈటీజర్  సినిమా పై వున్న అంచనాలను  మరింతగా పెంచేసింది. ఇక ఇప్పుడు ఈ చిత్రం నుండి  ప్రతి సోమవారం  ఒక్కో సాంగ్ చొప్పున  5సాంగ్స్ ను విడుదలచేయనున్నారు.  అందులో భాగంగా  రేపు  ఈచిత్రం నుండి మొదటి సాంగ్ మైండ్ బ్లాక్  ను  రేపు సాయంత్రం 5 :04 గంటలకు  విడుదలచేయనున్నారు.  పూర్తి మాస్ బీట్ తో   రానున్న ఈ సాంగ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
 
 
 
కామెడీ మరియు యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  సీనియర్  హీరోయిన్ విజయశాంతి  కీలక పాత్రలో  నటిస్తుంది. ఈసినిమా తో  13ఏళ్ళ తరువాత ఆమె మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది. కాగా  ఈచిత్రంలో మహేష్  ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తుండగా  ఆయనకు  జోడిగా  కన్నడ బ్యూటీ రష్మిక మందన్న  హీరోయిన్ గా నటిస్తుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.   ఏకే ఎంటర్ టైమెంట్స్ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , జి ఏం బి ప్రొడక్షన్స్ సంయుక్తంగా  నిర్మిస్తున్న ఈ చిత్రం  వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా  జనవరి12 న  విడుదలకానుంది.ఇటీవల  ఎఫ్ 2 తో  అనిల్ రావిపూడి  భారీ హిట్ కొట్టగా  భరత్ అనే నేను,  మహర్షి సినిమాలతో మహేష్ కూడా  హిట్లు కొట్టి  ఫుల్ ఫామ్ లో ఉండడం తో  సరిలేరునీకెవ్వరు పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: