మన పెద్ద వాళ్ళు చెప్పినట్లుగా పరిస్థితులు మరియు కాలం కలిసి రాని సమయంలో ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవడం సహజం. అందుకే దీపం ఉన్నపుడే మన పెద్ద వాళ్ళు ఇల్లు చెక్కబెట్టుకోమంటారు. అనగా మన చేతిలో డబ్బు ఉన్నప్పుడు కనుక జాగ్రత్త పడకపోతే, తరువాత అది కోల్పోయిన తరువాత బాధ పడి ప్రయోజనం ఉండదు. ఇక ఈ విషయం అంతా ఇప్పుడు ఎందకు చెప్పుకుంటున్నాం అంటే, ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఒకామె, ప్రస్తుతం ఆర్ధిక పరిస్థితి బాగోలేక టిఫిన్ సెంటర్ ఒకటి నడుపుకుంటూ ఇడ్లీలు, అట్లు, అమ్ము కుంటోంది. వివరాల్లోకి వెళితే, 

 

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన 1995లో వచ్చిన వీర్ ఘటి అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన పూజా దడ్వాల్ పరిస్థితి గురించి తెలిసిన ప్రతి ఒక్కరు ఎంతో చలిచిపోతున్నారు. వాస్తవానికి కొద్దిరోజుల క్రితం ఈమెకు భయంకరమైన క్షయ వ్యాధి సోకడంతో ఆమె మంచాన పడింది. అయితే ఆమె వైద్యానికి మరియు మందులకు కూడా డబ్బులు లేకపోవడంతో ఎన్నో అవస్థలు పడింది. కొద్దిరోజులకు ఈ విషయం కండల వీరుడు సల్మాన్ వరకు చేరడంతో ఆయన కొంత చలించిపోయి తనవంతుగా ఆమె అనారోగ్యానికి చికిత్స కోసం డబ్బు సాయం చేసారు. 

 

కాగా కొద్దిరోజులకు ఆ భయంకర వ్యాధికి చికిత్స తీసుకుని ఎలాగో ఆ మహమ్మారి నుండి బయట పడ్డ ఆమె, ఆ తరువాత సినిమా ఇండస్ట్రీ కి చెందిన పలువురుని కలిసి అవకాశాలు అర్ధించినప్పటికీ ఫలితం లేకుండా పోవడంతో, చివరకు వేరొకరిని సాయం అర్ధించడం తనకు ఇష్టం లేక, స్వయంకృషితో తానే ఒక చిన్న టిఫిన్ హోటల్ నడుపుకుంటున్నట్లు ఇటీవల ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపింది. తనపై ఎవరికీ జాలి అవసరం లేదని, కాకపోతే ఎవరైనా సినిమా ఇండస్ట్రీ వారు తనకు అవకాశాలు కల్పిస్తే తన జీవనం సాగించగలనికోరుకుంటున్నట్లు చెప్తోంది. కాగా ప్రస్తుతం పూజ పరిస్థితి తెలుసుకుని ఇప్పటికైనా బాలీవుడ్ నటులు ముందుకు వచ్చి ఆమెకు అవకాశాలు కల్పిస్తే బాగుంటుందని పలువురు ప్రజలు అభిప్రాయపడుతున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: