సూపర్ స్టార్ మహేష్ బాబు 26వ సినిమాగా వస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను అనీల్ రావిపుడి డైరెక్ట్ చేస్తుండగా దిల్ రాజు, అనీల్ సుంకర నిర్మిస్తున్నారు. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా నుండి సాంగ్స్ రిలీజ్ అయ్యే టైం వచ్చింది. ఈరోజు నుండి ప్రతి సోమవారం మహేష్ సరిలేరు నీకెవ్వరు సాంగ్స్ రిలీజ్ అవుతాయని చిత్రయూనిట్ ప్రకటించారు.

 

ఈరోజు సాయంత్రం ఐదుగంటల నాలుగు నిమిషాలకు మహేష్ సరిలేరు నీకెవ్వరు నుండి మొదటి సాంగ్ ఈరోజు రిలీజ్ కాబోతుంది. మైండ్ బ్లాక్ అనే మాస్ సాంగ్ తో సరిలేరు నీకెవ్వరు పాటల హంగామా మొదలవుతుంది. పోటీగా వచ్చే అల వైకుంఠపురములో సాంగ్స్ ఇప్పటికే సూపర్ హిట్ అవగా దేవి సరిలేరు నీకెవ్వరు సినిమాను చాలా ప్రెస్టిజియస్ గా తీసుకున్నాడని తెలుస్తుంది.

 

అందుకే ఈ సినిమాపై స్పెషల్ ఫోఅస్ పెట్టాడట. మళ్లీ మునుపటి దేవి అనిపించుకునేలా సరిలేరు సాంగ్స్ ఉంటాయని అంటున్నారు. అయితే అందులో ఏమాత్రం వాస్తవం ఉంది అన్నది ఈరోజు రిలీజ్ అయ్యే సాంగ్ ను బట్టి చెప్పొచ్చు. మహేష్ ఈ సినిమాలో మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించిన ప్రతి అప్డేట్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను ఎక్సైట్ చేస్తుంది. 

 

సినిమా 2020 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేశారు. జనవరి 11న సరిలేరు నీకెవ్వరు రిలీజ్ అవుతుంది. సినిమాలో విజయశాంతి, ప్రకాశ్ రాజ్ వంటి స్టార్స్ కూడా నటించారు. రీసెంట్ గా సినిమా నుండి వచ్చిన టీజర్ ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేసింది. మహేష్ సినిమా ఎలా ఉండాలో అలాంటివన్ని సినిమాలో ఉండేలా ఫ్యాన్స్ శాటిస్ఫై అయ్యేలా సరిలేరు నీకెవ్వరు ఉంటుందని తెలుస్తుంది. మరి ఈ సినిమాతో మహేష్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: