‘అల వైకుంఠపురములో’ మూవీ ఫస్ట్ టీజర్ రిలీజ్ చేయడానికి దీనికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ పూర్తి అయిపోయాయి. త్రివిక్రమ్ కు జాతకాల పై నమ్మకం ఎక్కువ కాబట్టి ఒకటి రెండు రోజులలో త్రివిక్రమ్ పెట్టిన ముహూర్తానికి ఈ టీజర్ రిలీజ్ అవుతుందని ప్రచారం జరుగుతోంది. 


తెలుస్తున్న సమాచారం మేరకు ఈ టీజర్ ఒక నిముషం వ్యవధిలో ఉండేలా కట్ చేసారని ఈ మూవీలోని పాత్రలు అన్నీ ఈ ఒక్క నిముషం టీజర్ లో కనిపిస్తాయని వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్ పూజా హెగ్డే లతో పాటు ఈ మూవీలో నటిస్తున్న టబు జయరామ్ మురళీ శర్మ రోహిణి లతో పాటు సుశాంత్ నివేదా పెతురాజ్ లు కూడ రేఖా మాత్రంగా కనిపించే విధంగా త్రివిక్రమ్ చాల తెలివిగా ఈ టీజర్ ను చాల శ్రద్ధ తీసుకుని కట్ చేసినట్లు సమాచారం. 


అయితే ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ టీజర్ లో ప్రకాష్ రాజ్ పేల్చిన పంచ్ డైలాగ్ కు మించి ఈ మూవీ టీజర్ లో కూడ ఒక పంచ్ డైలాగ్ ఉంటుందని ఆ డైలాగ్ లో త్రివిక్రమ్ మార్క్ కనిపిస్తుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఆ ఫినిషింగ్ టచ్ బన్నీ తో కాకుండా ఈ మూవీలో నటించిన మరొక కీలక పాత్ర చేత ఇప్పించినట్లు ఇప్పటికే ఈ ట్రైలర్ ను ఎడిటింగ్ టేబుల్ దగ్గర చూసిన వారి దగ్గర నుండి లీకులు వస్తున్నాయి. 

ఈరోజు ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రమోషన్ కు సంబంధించి మొదటి సోమవారం పూర్తి అయిన తరువాత అతి తక్కువ గ్యాప్ లోనే ఈ టీజర్ విడుదల ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే ‘సామజవరగమన’ పాటకు వంద మిలియన్ వ్యూస్ యూట్యూబ్ లో వచ్చిన నేపధ్యంలో ఈ మ్యానియాను మరింత పెంచే విధంగా త్రివిక్రమ్ ‘అల వైకుంఠ’ తీజర్ ను చాల ఆసక్తికరంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: