డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తమ్ముడు పూరి శంకర్ కి ఏ సినిమా కలిసి రావట్లేదు. పూరి దర్శకతంలో వచ్చిన 143 సినిమా కొద్దో గొప్పో పేరు తీసుకువచ్చింది. ఆ తర్వాత సాయి రామ్ శంకర్ చేసిన సినిమాలేవీ పెద్దగా ప్రేక్షకుల మెప్పు పొందలేదు. మళ్ళీ పూరి జగన్నాథ్ రాసిన కథతో బంపర్ ఆఫర్ అంటూ మన ముందుకు వచ్చాడు. సాయి రామ్ శంకర్ కెరీర్లో బంపర్ ఆఫర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

 

సాయి రామ్ శంకర్ అంటే గుర్తొచ్చేవి ఈ రెండు సినిమాలే. బంపర్ ఆఫర్ తర్వాత సాయి రామ్ శంకర్ కెరీర్లో సరైన హిట్ రాలేదు. వరుస పెట్టి సినిమాలు చేస్తున్నప్పటికీ విజయం మాత్రం అందుకోలేదు. అయితే ప్రస్తుతం సాయి రామ్ శంకర్ మరో సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. "రీ సౌండ్" అనే టైటిల్ తో సరికొత కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా లాంఛన కార్యక్రమాలు నిన్ననే జరిగాయి.

 

‘రియల్ రీల్స్ ఆర్ట్స్, అమృత హరిణి క్రియేషన్స్, శ్రీ శరణం అయ్యప్ప క్రియేషన్స్ పతాకం పై రానున్న ఈ సినిమా పూజ కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది . ముఖ్య అతిధులు దర్శకుడు సురేంద్ర రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేసారు. డైరెక్టర్ సుకుమార్ క్లాప్ ఇచ్చారు. మొదటి షాట్ కు పోసాని కృష్ణ మురళి దర్శకత్వం వహించారు. రొమాంటిక్ పేరుతో మన ముందుకు రాబోతున్న హీరో ఆకాష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

అనంతరం పాత్రికేయుల సమావేశం లో ముఖ్య అతిధిగా విచ్చేసిన దర్సకుడు సుకుమార్ మాట్లాడుతూ “సాయి రామ్ శంకర్ మళ్ళి రీసౌండ్ పేరుతో వస్తున్నందుకు చాలా సంతోషం గా ఉంది. హీరో సాయి రామ్ శంకర్ మాట్లాడుతూ ” మా సినిమా పేరు రీసౌండ్ , మంచి కథ, కొత్త గా ఉంటుంది అని  అన్నారు. జె సురేష్ రెడ్డి, రాజు, ఎన్ వి ఎన్ రాజా రెడ్డి సంయుక్తం గా నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ణ చిరుమామిళ్ళ దర్శకత్వం వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: