టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ హీరోగా యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు చివరి దశ షూటింగ్ జరుపుకుంటోంది. సీనియర్ నటి విజయశాంతి ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సంగీత, బండ్ల గణేష్, శ్రీనివాస రెడ్డి, సుబ్బా రాజు, వెన్నెల కిషోర్, హరితేజ తదితరులు నటిస్తుండగా ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా రత్నవేలు ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. మహేష్, దిల్ రాజు, 

 

అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ ఇటీవల రిలీజ్ అయి సూపర్ రెస్పాన్స్ సంపాదించిన విషయం తెలిసిందే. ఈ సినిమా నుండి మైండ్ బ్లాక్ అనే మాస్ సాంగ్ ని సాయంత్రం యూట్యూబ్ లో రిలీజ్ చేయబోతోంది సినిమా యూనిట్. కాగా ఈ సినిమాకు సంబంధించి హీరో మహేష్ బాబు మరియు నటి విజయశాంతి కొందరు యూనిట్ సభ్యులతో కలిసి దిగిన ఫోటో ఒకటి నేడు పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 

 

ఆ ఫోటో ని బట్టి చూస్తుంటే విజయశాంతి మంచి పవర్ఫుల్ రోల్ లో నటిస్తున్నట్లు అర్ధం అవుతుందని పలువురు నెటిజన్లు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మంచి ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. దానితో పాటు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కోరుకునే మాస్ మరియు కమర్షియల్ అంశాలు అన్ని కూడా కలగలిపినట్లు తెలుస్తోంది. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ చేయనున్నారు. మహేష్ బాబు తన కెరీర్ లో తొలిసారి ఒక మిలిటరీ మేజర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఆయనకు ఎంత వరకు సక్సెస్ ని అందిస్తుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: