అనిల్ రావిపూడి దర్శకత్వం లో మహేష్ బాబు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా టీజర్ ఇటీవల విడుదలయి సోషల్ మీడియాలో మరియు యూట్యూబ్ చానల్లో రికార్డుల మీద రికార్డులు నెలకొల్పింది. ఎప్పటినుండో మహేష్ బాబు అభిమానులు ఎదురు చూస్తున్న తరుణంలో టీజర్ వదలడంతో టీజర్ లో మహేష్ బాబు డైలాగ్ డెలివరీ చాలా కొత్తగా ఉండటంతో సినిమా టీజర్ విడుదలైన నాటి నుండి యూట్యూబ్ లో ట్రెండ్ అవుతు సరికొత్త రికార్డులు నెలకొల్పింది. అయితే ఈ క్రమంలో ప్రమోషన్ విషయంలో సినిమా యూనిట్ బాగా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు అభిమానులు సోషల్ మీడియాలో ఇటీవల విమర్శలు చేయడంతో తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు అదిరిపోయే రీతిలో చేయాలని సినిమా యూనిట్ అందుకు తగ్గట్టు అదిరిపోయే రేంజ్ లో అప్డేట్ ఇస్తూ వస్తున్నారు.

 

దీనిలో భాగంగా మహేష్ ఫ్యాన్స్ డిమాండ్ మేరకు సినిమాలోని పాటలను ఒక్కో సాంగ్ ఒక్కొక్కటిగా డిసెంబర్ నెల నుండి విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడంతో తాజాగా మహేష్ అభిమానులు దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి ఏ విధంగా సంగీతం అందించారో అన్న ఆసక్తి మహేష్ అభిమానులలో నెలకొంది. దీనిలో భాగంగా మహేష్ అభిమానుల టెన్షన్ నివృత్తి చేయడానికి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మొట్టమొదటి సాంగ్ గా మాస్ సాంగ్ విడుదల చేయాలనే  ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.

 

ఈ సందర్భంగా మహేష్ బాబు అభిమానులు మాస్ సాంగ్ కోసం రెడీ అవ్వండి అంటూ దేవిశ్రీ ప్రసాద్ పేర్కొన్నారు. ఈ సాంగ్ ఈ డిసెంబర్ 2 సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు విడుదల కానుంది.మరి దేవి ఏ స్థాయిలో ఈ సాంగ్ ను కంపోజ్ చేశారో చూడాలి. వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమా పై మహేష్ అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: