లోకంలో రోజు రోజుకు మహిళలపై జరుగుతున్న దారుణ సంఘటనలను చూస్తుంటే ముందు ముందు వారి ఉనికే ప్రశ్నార్ధకంగా మారుతుందా అనే అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. ఎందుకంటే చదువుకున్న మూర్ఖుల దగ్గరినుండి చదువులేని దరిద్రుల వరకు ఆడపిల్లను ఆటలో బొమ్మలా నలిపేస్తున్నారు. వారిని కన్న తల్లి కూడా ఆడదే అన్న విషయాన్ని మరచిపోతున్నారు. కొందరు నీచులైతే తల్లిని కూడా అంగట్లో అమ్మడానికి వెనుకాడరు. సమాజంలోని మనుషులు ఇంత కౄరంగా తయారవుతున్నారు.

 

 

మగ గద్దలు వయస్సు మరిచి, హోదా మరిచి చేస్తున్న ఆకృత్యాలకు భరతమాత కూడా సిగ్గుతో తలదించుకునే పరిస్దితులు తలెత్తుతున్నాయి. ఇకపోతే తాజాగా తన భార్యను దారుణంగా హింసించి కొట్టిన ఓ టీవీ నటుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.  వివరాల్లోకి వెళ్తే... తమిళ టీవీ నటుడు ఐశ్వర్ రఘునాథన్ .. అతని భార్య జయశ్రీ డాన్స్ మాస్టర్ గా చేస్తున్నారు. ఇక చెన్నైలోని తిరువాన్మయూర్, ఎల్‌బీ రోడ్డులో వీరిద్దరూ నివాసం ఉంటున్నారు.

 

 

ఇకపోతే ఐశ్వర్ రఘునాథన్ కొంతకాలం క్రితం, జయశ్రీకి చెందిన ఆస్తులకు సంబంధించిన పత్రాలను తీసుకుని, వాటిని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాడు. ఈ క్రమంలో ఆ డబ్బులు తిరిగి కట్టి, పత్రాలను వెనక్కు తెచ్చే విషయంలో భార్యభర్తలకు తరచూ గొడవలు అవుతుండేవి., ఈ క్రమంలో శనివారం కూడా ఇద్దరూ ఇదే విషయంపై గొడవ పడ్డారు. ఆ గొడవ తీవ్ర రూపం దాల్చడంతో వారి మద్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

 

 

దీంతో ఆగ్రహం పట్టలేకపోయిన ఐశ్వర్, తన భార్యను దారుణం గా కొట్టాడు. దీంతో ఆమె గాయాలతో అడయార్ ప్రాంతంలోని ఓ ఆసుపత్రిలో చేరింది. భర్తపై మహిళా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఐశ్వర్‌ రఘునాథన్‌ను, అతని తల్లిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: