వివాదస్పద అంశాలను టచ్ చేస్తూ కాంట్రవర్షియల్ కేరాఫ్ అడ్రస్ గా ఉండే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న సినిమాలు సోషల్ మీడియాలో మరియు టాలీవుడ్ ఇండస్ట్రీలో అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అవుతున్నాయి. లక్ష్మీస్ ఎన్టీఆర్ మరియు అదే విధంగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే రెండు సినిమాలతో ఆంధ్ర రాజకీయ నాయకులకు నిద్ర లేకుండా చేస్తున్న రామ్ గోపాల్ వర్మ తాజాగా మరో కాంట్రవర్షియల్ సబ్జెక్టు లాంటి సినిమా తీయబోతున్నట్లు ఫిలింనగర్లో వార్తలు వినబడుతున్నాయి.

 

ఇటీవల రాంగోపాల్ వర్మ ప్రముఖ రాజకీయ నేతలకు సంబంధించిన వివాదాస్పద అంశాలు మరియు అదే విధంగా కులాలకు సంబంధించి సబ్జెక్ట్ కలిగిన కథలను పోలిన విధంగా సినిమాలు తెరకెక్కిస్తు ఎలక్ట్రానిక్ మీడియాలో మరియు సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సినిమాకి హైప్  తీసుకు వస్తున్న నేపథ్యంలో కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా ఓ టీవీ షోలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కి మరియు అదే విధంగా జొన్నవిత్తుల మధ్య చర్చ జరిగింది. ఈ క్రమంలో ఆర్జీవీ తనతో మాట్లాడిన తీరు నచ్చని జొన్నవిత్తుల అతడిపై మండిపడ్డారు.

 

తనకు వర్మ 'జొన్నవిత్తుల చౌదరి' అని బిరుదు ఇచ్చాడని.. వర్మకి 'పప్పు వర్మ' అనే బిరుదు ఇస్తున్నట్లు చెప్పారు జొన్నవిత్తుల. రామ్ గోపాల్ వర్మ బరితెగించినవాడు, బతికున్న శవం లాంటి వాడు అంటూ తీవ్రస్థాయిలో తిట్టిపోశారు. రామ్ గోపాల్ వర్మ ఫిలాసఫీ పైన 'పప్పు వర్మ' అనే బయోపిక్ తీస్తానంటూ చెప్పుకొచ్చారు. అయితే తాజాగా దానికి సన్నాహాలు చేస్తున్నట్లు త్వరలోనే పప్పు వర్మ అనే బయోపిక్ తీయడానికి జొన్నవిత్తుల స్క్రిప్టు రెడీ చేస్తున్నట్లు ఆ సినిమాలో మెయిన్ నటుడిని ఎంపిక చేసుకోవడానికి జొన్నవిత్తుల ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు ఇండస్ట్రీలో టాక్ వినపడుతోంది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: